అక్కడ ఉన్నది తరగతి గదా లేక స్పా సెంటరా? విద్యార్థులతో ఆ టీచర్ ఏకంగా

పాఠశాలలు విద్యార్థులకు దేవాలయాలు, ఉపాధ్యాయులు దేవుడిలాంటి వారు.

విద్యార్థులకు ఆదర్శంగా నిలవాల్సిన ఉపాధ్యాయుడే దారి తప్పితే ఏం జరుగుతుందో ఈ ఘటనే ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తోంది.

ఇటీవల ఉపాధ్యాయులు విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియా( Social media )లో వైరల్ అవుతున్నాయి.ఇప్పుడు రాజస్థాన్‌( Rajasthan ) లోని జైపూర్‌లో ఇలాంటి అవమానకర ఘటనే చోటు చేసుకోగా, ఉపాధ్యాయుడి చర్య ఇప్పుడు సర్వత్రా దుమారం రేపుతోంది.

పిల్లలకు పాఠాలు చెప్పడమే కాకుండా.తరగతి గదిలోనే ఓ టీచర్ విద్యార్థులతో మసాజ్ చేయించుకున్న ఘటన సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.ఇక వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు ఉపాధ్యాయుడి చర్యతో విద్యార్థుల భవిష్యత్తు ఏమవుతుందోనని నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వైరల్ అవుతున్న వీడియో చూస్తే క్లాస్‌రూమ్‌లో ఓ టీచర్‌ నేలపై పడుకుని విద్యార్థులు మసాజ్‌ చేయిస్తున్న దృశ్యం కనిపిస్తోంది.అక్కడే తరగతి గదిలో మరో టీచర్, తనకు సంబంధం లేదన్నట్టుగా కూర్చుంది.

Advertisement

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారి సర్వత్రా దుమారం రేపుతోంది.

ఈ వీడియో వైరల్‌గా మారడంతో ఉపాధ్యాయుడి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన క్షేత్ర విద్యాశాఖాధికారి విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని సూచించారు.ఈ విషయంలో తప్పు చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని తెలిపారు.ఇలా పిల్లలతో మాసాజ్ చేపించుకోవడం కరెక్ట్ కాదని కామెంట్లు చేస్తున్నారు.

ఉపాధ్యాయురాలిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.ఈ సంఘటనపై పలువురు ఉపాధ్యాయులు కూడా వారి అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

ఇకపోతే ఈ విషయంపై సదరు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అంజు చౌదరి స్పందించింది.ఈ వైరల్ అవుతున్న వీడియో తాను కూడా చూశానని.

నెలకి లక్షన్నర సేవ్ చేస్తున్న కపుల్.. కానీ నచ్చిన ఇల్లు కొనలేని దుస్థితి..?
ఏంటి లాస్య చివరికి ఇలా అయిపోయావు? ఫొటోస్ వైరల్

, టీచర్ అనారోగ్యంతో ఉందని.ఆమె పాదాలకు మసాజ్ చేయమని పిల్లలను అభ్యర్థించి ఉండవచ్చని ఆమె తెలిపారు.

Advertisement

అయితే., ఈ విషయంలో నిజానిజాలు తెలియాలంటే విచారణ జరుపుతామని ఆమె స్పష్టం చేసింది.

తాజా వార్తలు