కోయంబత్తూర్ కారు పేలుడు కేసులో దర్యాప్తు ముమ్మరం..

తమిళనాడులోని కోయంబత్తూర్ కారు పేలుడు కేసులో అధికారుల దర్యాప్తు వేగవంతంగా కొనసాగుతోంది.ఈ కేసుపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

అదేవిధంగా కేసును చెన్నైలోని పూందమల్లి ప్రత్యేక కోర్టుకు బదిలీ చేశారు.నిందితుడు మొబిన్ నివాసంలో పోలీసులు మరోసారి సోదాలు నిర్వహించారు.

ఈ తనిఖీలలో పేలుడు పదార్థాలు, 109 వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు ఎఫ్ఐఆర్ లో నమోదు చేశారు.ఈనెల 23న కారు బాంబు పేలిన ఘటన తమిళనాడులో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

అయితే ఈ కేసులో ఎన్ఐఏ దర్యాప్తునకు రికమెండ్ చేస్తూ సీఎం స్టాలిన్ లేఖ రాసారు.కేసు దర్యాప్తును ఎన్‌ఐఏకు బదిలీ చేయాలని, కోయంబత్తూర్‌లో కావాల్సిన భద్రతా ఏర్పాట్లను కొనసాగించాలని లేఖలో కోరారు.

Advertisement
గుంటూరు జీజీహెచ్ లో పెట్ స్కాన్' సిద్ధం