ప్రతి హీరో కెరీర్ లో కొన్ని సినిమాలు స్పెషల్ సినిమాలుగా నిలుస్తాయి.
స్టార్ హీరో మోహన్ బాబు కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమాలలో పెదరాయుడు సినిమా కూడా ఒకటి.
ప్రముఖ దర్శకుడు రవిరాజా పినిశెట్టి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.ఈ సినిమాలో హీరోయిన్లుగా భానుప్రియ, సౌందర్య నటించారు.1995 సంవత్సరంలో రిలీజైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.ఈ సినిమాలో రజినీకాంత్ పాపారాయుడి పాత్రలో నటించారనే సంగతి తెలిసిందే.
బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధించడంతో పాటు ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన నాట్టామై సినిమాకు ఈ సినిమా రీమేక్ కావడం గమనార్హం.
వరుస ఫ్లాపులతో మోహన్ బాబు కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొన్న సమయంలో పెదరాయుడు సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.రజినీకాంత్ ఈ సినిమాలోని పాత్ర కోసం పారితోషికం తీసుకోలేదు.
మోహన్ బాబు ఆస్తులను తాకట్టు పెట్టి ఈ సినిమాను నిర్మించడం గమనార్హం.
ఘరానా మొగుడు సినిమాతో చిరంజీవి క్రియేట్ చేసిన రికార్డులు ఈ సినిమాతో బ్రేక్ అయ్యాయి.అయితే ఈ సినిమాకు దర్శకుడిగా మొదట బి.గోపాల్ ఎంపికయ్యారు.అయితే బి.గోపాల్ కు వేరే సినిమా కమిట్మెంట్ ఉండటం వల్ల ఈ సినిమాను వదులుకోవాల్సి వచ్చింది.
ఒకవేళ బి.గోపాల్ ఈ సినిమాకు దర్శకత్వం వహించి ఉంటే మాత్రం ఈ సినిమా బి.గోపాల్ కెరీర్ కు ప్లస్ అయ్యి ఉండేదని చెప్పవచ్చు.బి.గోపాల్ ఈ సినిమాతో పాటు సింహాద్రి సినిమాకు దర్శకత్వం వహించే అవకాశాన్ని కూడా పోగొట్టుకున్నారు. విజయేంద్ర ప్రసాద్, బాలయ్య, బి.గోపాల్ కాంబినేషన్ లో సినిమా ప్లాన్ చేయగా కొన్ని కారణాల వల్ల ఆ సినిమా ఎన్టీఆర్ రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కింది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy