దుండగుడి దాడిలో చావు అంచుల దాకా.. నెలల తర్వాత సల్మాన్ రష్డీ తొలి ఇంటర్వ్యూ

దుండగుడి చేతిలో హత్యాయత్నానికి గురై, చావు అంచులదాకా వెళ్లొచ్చిన భారత సంతతికి చెందిన ప్రఖ్యాత రచయిత సల్మాన్ రష్డీ చాలా రోజుల తర్వాత బయటి ప్రపంచం ముందుకు వచ్చారు.నాటి ఘటనలో కుడి కన్నును కోల్పోయినా, శరీరం సహకరించుకున్నా రచనను తాను కొనసాగిస్తానని ఆయన స్పష్టం చేశారు.

 Indian Origin Author Salman Rushdie Gives First Interview Since 2022 Stabbing De-TeluguStop.com

తాజాగా హత్యాయత్నం తర్వాత తొలి ఇంటర్వ్యూను ఇచ్చాడు.న్యూయార్కర్‌కు చెందిన డేవిడ్ రెమ్నిక్ ఆయనను ఇంటర్వ్యూ చేశారు.

ప్రస్తుతం తన పరిస్ధితి మెరుగ్గానే వుందని సల్మాన్ రష్డీ అన్నారు.తన బొటనవేలు, చూపుడు వేలు, అరచేతి దిగువ భాగం ఇంకా సహకరించడం లేదని ఆయన తెలిపారు.

దీనికి సంబంధించి తాను హ్యాండ్ థెరపీ చేస్తున్నానని సల్మాన్ తెలిపారు.ఈ ఇంటర్వ్యూలో తనపై దాడి చేసిన వ్యక్తిని ఇడియట్ అని అభివర్ణించాడు.అతనిపై తనకు ఎలాంటి కోపం లేదని సల్మాన్ అన్నారు.నిందారోపణలను ఎదుర్కోవడానికి తాను చాలా ఏళ్లుగా ప్రయత్నించానని ఆయన చెప్పారు.

ఇక సల్మాన్ రష్డీ కొత్త నవల ‘‘విక్టరీ సిటీ’’ ప్రచురణ సందర్భంగా ఆయన ఈ ఇంటర్వ్యూ ఇచ్చారు.దీనిని దాడికి నెల ముందు పూర్తి చేశారు.

Telugu Authorsalman, Indianorigin, Iran, Muslims, York, Salmanrushdie, Satanic V

247 సంవత్సరాలు జీవించే ఒక కథానాయకుడి కథే ఈ విక్టరీ అని రష్డీ తెలిపారు.ఇప్పటికే దీనికి పాజిటివ్ రివ్యూలు వచ్చాయి.సోషల్ మీడియాలో నెలల తరబడి మౌనంగా వున్న రష్డీ ఇప్పుడు సందర్భానుసారంగా ట్వీట్లు చేస్తున్నారు.అలాగే నెటిజన్లు అడిగే ప్రశ్నలకు సైతం సమాధానాలు ఇస్తున్నారు.కోలుకోవడానికి ప్రయత్నిస్తున్నానని.కానీ చాలా కష్టంగా వుందని సల్మాన్ రష్డీ ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు.

Telugu Authorsalman, Indianorigin, Iran, Muslims, York, Salmanrushdie, Satanic V

కాగా.సల్మాన్ రష్డీ 1988లో రచించిన ‘‘ ది సాటానిక్ వెర్సెస్’’ కోట్లాది మంది ముస్లింలను , ఇస్లాంను, మొహ్మద్ ప్రవక్తను కించపరిచేలా వుందని ఆయనపై ముస్లిం దేశాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.కానీ ఈ విషయాన్ని ఇరాన్ మాత్రం సీరియస్‌గా పరిగణించింది.నాటి ఆ దేశ అధినాయకుడు అయతోల్లా రుహోల్లా ఖొమేనీ . సల్మాన్ ‌ను హతమార్చాల్సిందిగా ఫత్వా జారీ చేశారు.దీంతో సల్మాన్ రష్డీ కొన్నేళ్ల పాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

దశాబ్ధాలు గడవటంతో, సల్మాన్ ప్రాణాలకు ముప్పు ముగిసిపోయిందని.ఫత్వా కేవలం పబ్లిసిటీ స్టంట్ మాత్రమేనని భావిస్తోన్న తరుణంలో రష్డీపై గతేడాది జరిగిన దాడి యావత్ ప్రపంచాన్ని నివ్వెరపరిచింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube