ఆదర్శ వివాహాలను ప్రోత్సహించాలి:కోట గోపి

సూర్యాపేట జిల్లా:ఆదర్శ వివాహాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని, కులాంతర,మతాంతర ఆదర్శ వివాహాలు ప్రభుత్వ రక్షణ ద్వారానే సాధ్యమవుతాయని సూర్యాపేట జిల్లా సిపిఎం కార్యవర్గ సభ్యులు కోట గోపి( Kota Gopi ) అన్నారు.గురువారంజిల్లా కేంద్రంలోని జమ్మిగడ్డ ప్రాంతానికి చెందిన షేక్ అక్బర్,షేక్ సూపియాలు గత నాలుగు సంవత్సరాలుగా ప్రేమించుకుంటూ సిపిఎం( CPM ) ఆధ్వర్యంలో జరిగిన ఆదర్శ వివాహంతో ఒకటైయ్యారు.

 Ideal Marriages Should Be Encouraged: Kota Gopi , Kota Gopi , Marriages ,cpm ,-TeluguStop.com

ఎంవిఎన్ భవనంలో జరిగిన ఈ వివాహానికి ఆయన హాజరై మాట్లాడుతూ ఇలాంటి ఆదర్శ వివాహాలను ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.ప్రభుత్వం కూడా వీటిని ప్రోత్సహిస్తూ వారికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో అవాజ్ జిల్లా కార్యదర్శి షేక్ జహంగీర్,జిల్లా సిపిఎం కార్యవర్గ సభ్యులు చిన్నపంగ నరసయ్య, అర్వపల్లి లింగయ్య,షేక్ సైదులు,షేక్ ఇమామ్,దైదా ఉపేందర్,అబ్బాయి తల్లిదండ్రులు,షేక్ కాజా తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube