ఆఫ్గాన్ లో అమెరికా సామ్రాజ్యవాద దురహంకార ప్రభావం అక్కడ ప్రజలకు నిట్ట నీడ లేకుండా చేసింది.ఆఫ్గాన్ వాసుల జీవిత గమనాన్నే మార్చేసింది.
ఆఫ్గానిస్థాన్ లో సంక్షోభం ఏర్పడిందని ఐక్యరాజ్యసమితి ఆందోళన చేపట్టింది.ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలోని ఎంతోమది ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నారు.
పిల్లల క్షుద్బాధ తీరే దారిలేక ఇంట్లో ఉన్న విలువైన వస్తువులను వచ్చిన రేటుకే అమ్మేసే పరిస్థితి ఏర్పడింది.కాబూల్ వీధులు సంతలను తలపిస్తున్నాయి.
అన్ని వస్తువులను వచ్చేదాక ఏం చేస్తున్నారు ఇరవై ఐదు వేలు(25,000) పెట్టి కొనుక్కున్న రిఫ్రిజిరేటర్ ను 5 వేలకు అమ్మేస్తున్నారు.లక్షలు పోసి కొన్న వస్తువులను వేలకే అమ్మేస్తున్నారు.
ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు అక్కడ రోడ్లపై అమ్మకానికి పెట్టిన పరిస్థితి కుటుంబ సభ్యులు.
ఆకలి తీర్చతే చాలాంటూ.
టీవీలు, ఫ్రిజ్ లు, అల్మారాలు, అన్నీ రోడ్లపైనే ఉన్నాయి. తాలిబన్లు కాబూల్ ను చేపట్టి నెల రోజులు కావస్తున్నా ఆర్థిక సమస్యలు ఆదర్శాన్ని కుదిపేస్తున్నాయి.
పాలన ఇంకా పట్టలేక పోవడంతో అంతా అరాచకంగా ఉంది.ఆర్థిక సమస్యలతో పాటు ఆహార కొరత కూడా ఆ దేశాన్ని అతలాకుతలం చేస్తుంది.
ప్రపంచ ఆహార కార్యక్రమం కింద ఉంచిన ఆహార నిల్వలు ఈ నెల కు మాత్రమే సరిపోతాయని ఐక్యరాజ్య సమితి హెచ్చరించింది.దీన్ని బట్టి చూస్తుంటే ఆఫ్గానిస్థాన్ వాసులు మున్ముందు మరిన్ని గడ్డు పరిస్థితులను ఎదుర్కోనుంది.
పనిస్థలంలో తాలిబన్లు మహిళలను పశువుల కన్నా హీనంగా చూస్తున్నారు మహిళలను గొంతెత్తిన ఇవ్వడంలేదు పరిస్థితులు దారుణంగా ఉన్నాయని ఆఫ్ఘనిస్తాన్ మాజీ పార్లమెంట్ సభ్యురాలు పింకాయ్ ఆవేదన వెలిబుచ్చారు.ఆఫ్ఘన్ మహిళలు తమ కాళ్లపై తాము నిలబడేందుకు కృషి చేసారు.
ఇప్పుడిదంతా నిర్వీర్యం అయిందని పాత్రికేయురాలు ఫాతిమా పేర్కొన్నారు.