భారత సంతతి మహిళకు భారీ జాక్ పాట్...కళ్ళు చెదిరేలా లాటరీ

రాత్రికి రాత్రి కోటీశ్వరులు అయిపోతే ఎంత బాగుంటుందని అనుకునే వారు ఎవరు ఉండరు చెప్పండి.

ఏదన్నా లక్కీ డ్రా తగిలి కోటీశ్వరులు అయిపోతే బాగుండు అనుకుని లాటరీల రూపంలో తమ అదృష్టాన్ని ఎంతో మంది పరీక్షించుకుంటూ ఉంటారు.

కానీ అదృష్టం ఎప్పుడు ఎవరిని ఏ రూపంలో వరిస్తుందో తెలియదు.లక్కీ డ్రా లతో ఓవర్ నైట్ కోటీశ్వరులు అయిన వారు ఎంతో మంది ఉన్నారు.

ముఖ్యంగా దుబాయ్ దేశాలలో ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయి.మరీ ముఖ్యంగా అక్కడ లక్కీ డ్రాలు అధిక శాతం భారతీయులనే వరించడం ఎంతో ఆసక్తిగా ఉంటుంది.

తాజాగా అబుదాబి బిగ్ టిక్కెట్ లాటరీలో భారీ మొత్తాన్ని భారత సంతతికి చెందిన మహిళ గెలుచుకోవడం ఇప్పుడు అక్కడ హాట్ టాపిక్ గా మారింది.ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 22 మిలియన్ దిర్హమ్స్ (అంటే భారతీయ కరెన్సీలో రూ.45 కోట్లు) లాటరీని అబుదాబి లో ఉంటున్న భారత సంతతి మహిళ లీనా జలాల్ గెలుచుకుని వార్తల్లో నిలిచారు.అబుదాబి బిగ్ టిక్కెట్ లాటరీని నిన్నటి రోజున డ్రా తీయగా లీనా జలాల్ మొదటి బహుమతిగా ఈ భారీ మొత్తాన్ని గెలుపొందినట్టుగా నిర్వహకులు ప్రకటించారు.

Advertisement

లీనా జలాల్ కేరళా రాష్ట్రం త్రిచూర్ కి చెందిన వ్యక్తిఉద్యోగ నిమిత్తం అబుదాబిలోని హ్యూమన్ రిసోర్స్ లో ప్రొఫెషనల్ గా విధులు నిర్వహిస్తున్నారు.అయితే అబుదాబిలో లాటరీ టిక్కెట్ల డ్రాలలో ఎక్కువ శాతం భారతీయులు గెలుపొందటం చూసిన లీనా తన స్నేహితులతో కలిసి లాటరీ మొదటి సారిగా టిక్కెట్లు కొనుగోలు చేసింది.అయితే తన మొదటి ప్రయత్నంలోనే ఇంత పెద్ద మొత్తంలో గెలుచుకోవడం తమని షాక్ కి గురిచేసిందని అసలు తాము ఊహించలేదని, మొత్తం 10 మంది స్నేహితులు కలిసి ఈ మొత్తాని గెలుచుకున్నట్టుగా ఆమె తెలిపింది.

త్వరలో ఈ మొత్తం పంచుకున్న తరువాత కొంత డబ్బును చారిటీకి ఉపయోగిస్తానని ఆమె తెలిపింది.

Advertisement

తాజా వార్తలు