తమిళనాట అభిమానులు ఇతర రాష్ట్రాల అభిమానులతో పోల్చితే రెండు మూడు అడుగుల ముందే ఉంటారు.తమ అభిమాన హీరో సినిమాలు రిలీజ్ అయితే వారు చేసే హడావుడి అంతా ఇంతా ఉండదు.
అభిమానులు రెచ్చి పోవడం తమిళనాట చాలా కామన్.ఏ స్టార్ హీరో సినిమా తమిళ నాట విడదలైనా కూడా హడావుడి ఆకాశాన్ని తాకేలా ఉంటుంది.
ప్రతి థియేటర్ వద్ద పెద్ద ఎత్తున సందడి, బాంబులు కాల్చడం, హీరో కటౌట్స్కు పాలాభిషేకాలు చేయడం చేస్తూ ఉంటారు.అలాంటి అభిమానులను ఇంకా రెచ్చగొట్టేలా హీరో శింబు తాజాగా త్వరలో విడుదల కాబోతున్న తన సినిమా కటౌట్స్కు పెద్ద ఎత్తున పాలాభిషేకాలు చేయాలంటూ పిలుపునిచ్చాడు.
ఒక హీరో తన కటౌట్స్కు పాలాభిషేకాలు చేయమంటూ ఎవరిని కోరడు.కాని శింబు మాత్రం పాలాభిషేకాలు కావాలంటూ కోరడంతో అభిమానులు తప్పకుండా చేయాలని ఫిక్స్ అయ్యారు.మామూలుగా ఇతర హీరోలకు పాలాభిషేకాలు చేసేందుకు అర్థరాత్రి సమయంలో అభిమానులు పాల ట్యాంకర్లను ఆపేసి పాల దొంగతనంకు పాల్పడుతున్నారు.భారీ మొత్తంలో పాలు కొనుగోలు చేయాలన్నా కూడా వీలు పడటం లేదు కనుక పాల దొంగతనంకు వారు పాల్పడుతున్నారు.
కోలీవుడ్ స్టార్ హీరోల అభిమానులు ఇప్పటికే పలు సార్లు పాల దొంగతనంకు పాల్పడ్డారు.
ఇప్పుడు శింబు స్వయంగా తనకు పాలాభిషేకం కావాలంటూ కోరడంతో ఇక అభిమానులు ఏమైనా ఆగుతారా, ఎక్కడ ట్యాంకర్ కనిపిస్తే అక్కడ పాలను దొంగలించడం ఖాయం అంటున్నారు.ఈ విషయమై పాల ఉత్పత్తి దారుల సంఘం పోలీసులకు ఫిర్యాదు చేసింది.దాంతో పోలీసులు కూడా సీరియస్ గా యాక్షన్ తీసుకునేందుక సిద్దం అయ్యారు.
శింబు కటౌట్స్కు పాలాభిషేకాలను నిషేదించాలని నిర్ణయించారు.పసి పిల్లలు పాలు లేక అలమటిస్తుంటే ఇలా అభిమానులు పాలాభిషేకం చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
శింబు తన ప్రకటనను వెనక్కు తీసుకోవాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు.