మార్కెట్లోకి రకరకాల బైక్స్ అందుబాటులోకి వస్తున్నాయి.డిఫరెంట్ కలర్స్, స్టైల్ లుక్స్ తో బైక్ ప్రియులను అట్ట్రాక్ట్ చేసేలాగా రకరకల ఫీచర్స్ ను అందిస్తూ అదునాతన బైక్స్ ఎన్నో మార్కెట్లో సందడి చేస్తున్నాయి.
ఈ క్రమంలోనే వాటికీ పోటీగా హీరో మోటోకార్ప్ కంపనీ ఇప్పుడు ఆదునాతన ఫీచర్స్ తో ఒక సరికొత్త హీరో ప్యాషన్ ఎక్స్టెక్ బైక్ ను మార్కెట్లోకి విడుదల చేసింది.ఈ బైక్ లో గల ఫీచర్స్ విషయానికి వస్తే ఈ బైక్లో బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చామని కంపెనీ తెలిపింది.
అలాగే LED ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్ లకు కొన్ని అదునాతన మార్పులు చేసి ప్యాషన్ XTEC మోడల్ లో అందించారు.అంతేకాకుండా బైక్ యొక్క హెడ్ల్యాంప్ యూనిట్ ఇప్పుడు 12% పొడవైన బీమ్ ను కలిగి ఉందని కంపెనీ తెలిపింది.
ఇది బైక్ విజువల్ అప్పీల్ ను కూడా పెంచుతుంది.
మొట్ట మొదటిసారిగా కారును తలపించేలాగా బైక్ లో కూడా బ్లూటూత్ కనెక్టివిటీని అందుబాటులోకి తేవడం జరిగింది.
ఈ బ్లూటూత్ ను ఫోన్కి కనెక్ట్ చేసిన తర్వాత రైడర్ పేరుతో ఫోన్ కాల్ వచ్చినప్పుడు ఒక అలర్ట్ మెసేజ్ గాని లేదంటే మిస్డ్ కాల్తో ఎస్ఎంఎస్ నోటిఫికేషన్ గాని వస్తుంది అన్నమాట.ఈ బైక్ కు గల మరొక ప్రత్యేకత ఏంటంటే ఈ బైక్కి USB ఛార్జింగ్ పోర్ట్ కూడా లభిస్తుంది.
బైక్ నడుపుతూ కూడా బైక్ రైడర్స్ ఇక మీదట తమ స్మార్ట్ఫోన్ ను ఛార్జ్ చేసుకోవచ్చు.అలాగే బైక్ సర్వీస్ రిమైండర్ తోపాటు, ఇంధన అలెర్ట్ కు సంబందించిన విషయాలు కూడా మీటర్లో కనిపిస్తాయి.
అయితే హీరో ప్యాషన్ XTEC బైక్ యొక్క ఇంజిన్ లో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు.ఇది మునుపటిలాగా 110cc BS6 ఇంజిన్ను కలిగి ఉంది.ఇది 8bhp శక్తిని, 9.79nm టార్క్ను ఉత్పత్తి చేస్తుంది.బైక్లో దాదాపు 12 లీటర్ల ఇంధనం ట్యాంకులో పడుతుంది.ఇక మైలేజ్ విషయానికి వస్తే 68 కిలోమీటర్/ లీటర్ గా కంపెనీ పేర్కొంది.ఇక ఈ బైక్ యొక్క ధర విషయానికి వస్తే డ్రమ్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ.74,590 కాగా , డిస్క్ వేరియంట్ ధర రూ.78,990గా కంపెనీ ప్రకటించారు.ఈ బైక్ పై కంపెనీ 5 సంవత్సరాల వారంటీ కూడా అందిస్తుంది.