కొత్త స్మార్ట్ ఫోన్( Smart phone ) కొనాలని అనుకున్నవారికి శుభవార్త.వచ్చే నెలలోనే అనేక రకాల కొత్త స్మార్ట్ఫోన్స్ మార్కెట్లోకి దర్శనం ఇవ్వబోతున్నాయి.
షావోమి( Xiaomi ) దగ్గరి నుంచి వివో వరకు పలు కంపెనీలు కొత్త స్మార్ట్ఫోన్స్ను మార్కెట్లోకి లాంచ్ చేయనున్నాయి.కాబట్టి కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలని భావించేవారికి ఇది శుభతరుణం అని చెప్పుకోకతప్పదు.
ఇపుడు షావోమి కంపెనీ “రెడ్మి నోట్ 12”( Redmi Note 12 ) టర్బో ఫోన్ను లాంచ్ చేయనుంది.8 జీబీ ర్యామ్, క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7 ప్లస్ జెన్ 2 ప్రాసెసర్, 64 ఎంపీ ట్రిపుల్ కెమెరా మరెన్నో ఫీచర్లను కలిగిన ఈ ఫోన్ ధర కేవలం రూ.23,990 మాత్రమే.అదేకాకుండా “షావోమి 13”( “Xiaomi 13” ) స్మార్ట్ఫోన్ కూడా లాంచ్ కాబోతోంది.8 జీబీ ర్యామ్, క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్, 50 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరాతో ఇది వస్తోంది.కాగా ధర రూ.47,390గా ఉండొచ్చని చెబుతున్నారు.అదేవిధంగా “రియల్మి 11 ప్రో ప్లస్” ( Realme 11 Pro Plus )ఫోన్ కూడా రాబోతోంది.దీని ధర రూ.24,890 మాత్రమే.
ఇక “రియల్మి జీటీ నియో 5”( Realme GT Neo 5 ) 5జీ ఫోన్ విషయానికొస్తే, ఇందులో 8 జీబీ ర్యామ్, క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ప్రాసెసర్ ఉండనుంది.ధర విషయానికొస్తే రూ.31,690గా ఉండొచ్చని భోగట్టా.మోటరోలా ప్రియులకోసం ఇపుడు “ఎడ్జ్ 40 ప్రో” 5జీ ఫోన్ మార్కెటలోకి ఎంట్రీ ఇవ్వనుందని సమాచారం.దీని ధర మాత్రం రూ.80,930గా ఉండొచ్చని వినికిడి.అదేవిధంగా….శాంసంగ్ గెలాక్సీ ఎం54 ఫోన్, ఒప్పొ రెనో 9 స్మార్ట్ఫోన్, ఒప్పొ రెనో 10 ప్రో ప్లస్ ఫోన్లు కూడా ఎంట్రీ ఇవ్వనున్నాయి.
వీటన్నిటిలో దాదాపుగా 16 జీబీ ర్యామ్, స్నాప్డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ప్రాసెసర్, 50 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా వంటి అద్భుతమైన ఫీచర్లను వుంటాయని ఆయా కంపెనీలు చెబుతున్నాయి.