తెలుగులో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ భారతదేశం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.బాహుబలి తరువాత రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం కళ్లు కాయలు కాచేలా చూస్తున్నామంటూ ప్రేక్షకులు తమ ఆతృతను వెల్లబుచ్చుతున్నారు.
అయితే ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్లు కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు పీక్స్కు చేరుకున్నాయి.
ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో నటిస్తుండగా, చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నట్లు ఇప్పటికే చిత్ర యూనిట్ తెలిపిందా.
తాజాగా కొమురం భీం పాత్రను ఎలివేట్ చేసే విధంగా ఓ పాటను రాయాలని ప్రజాగాయకుడు గద్దర్ను చిత్ర దర్శకుడు రాజమౌళి కోరాడట.తెలంగాణ స్వాతంత్ర సమరయోధుడిగా కొమురం భీం ప్రాముఖ్యతను వివరించే విధంగా ఈ పాట ఉండాలని దర్శకుడు గద్దర్ను కోరాడట.
రాజమౌళి పాట రాయాల్సిందిగా కోరడంతో గద్దర్ వెంటనే ఒప్పుకున్నాడట.అంతేగాక ఈ పాటను గద్దర్ స్వయంగా పాడనున్నట్లు తెలుస్తోంది.ఆర్ఆర్ఆర్ సినిమాలో ఈ పాట హైలైట్ కానున్నట్లు తెలుస్తోంది.అంటే ఈ పాటతో తారక్ ఎలివేషన్ ఏ విధంగా ఉండనుందో మనం ఊహించుకోవచ్చు.డీవీవీ దానయ్య భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్, అజయ్ దేవ్గన్ తదితరులు నటిస్తున్నారు.ఈ ప్రతిష్టాత్మకమైన సినిమాను జూలై 30న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నారు.
.