మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి సతీమణి, మాజీ ఎమ్మెల్యే సీతా దయాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని తెలుస్తోంది.తాజాగా సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో కాంగ్రెస్ కూడా ధీటైన అభ్యర్థులను నిలబెట్టేందుకు తీవ్ర కసరత్తు చేస్తుంది.ఈ నేపథ్యంలో సీతా దయాకర్ రెడ్డి కనుక కాంగ్రెస్ కండువా కప్పుకుంటే పార్టీ బలోపేతం కావడంతో పాటు పాలమూరులో గెలుపు ఖాయమని భావిస్తుంది.
ఇప్పటికే చేరిక వ్యవహారంపై సీతా దయాకర్ రెడ్డి కాంగ్రెస్ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారని తెలుస్తోంది.రాష్ట్ర విభజన తరువాత టీడీపీలో కొనసాగిన ఆమె గతేడాది పార్టీకి రాజీనామా చేశారు.
ఇటీవలే కొత్తకోట దయాకర్ రెడ్డి అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే.