టీడీపీ వ్యాఖ్యలకు మాజీ మంత్రి బాలినేని కౌంటర్

ఏపీ సీఎం జగన్ పర్యటనపై టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.

గతంలో చంద్రబాబు సైకిల్ పై వెళ్లి రైతులను పరామర్శించారా అని ప్రశ్నించారు.

సీఎంగా ఎవరున్నా హెలికాప్టర్ లోనే వచ్చి పరామర్శిస్తారన్న విషయాన్ని మాజీ మంత్రి బాలినేని గుర్తు చేశారు.అలాగే నిన్న తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారన్న ఆయన కొంతమంది నేతలు నిర్లక్ష్యంగా ఉన్నారని తాను హెచ్చరించానని పేర్కొన్నారు.

వచ్చే ఎన్నికల్లో రెట్టింపు మెజార్టీతో గెలుస్తానని తెలిపారు.వచ్చే ఎన్నికల్లో జగన్ మళ్లీ సీఎం అవుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

అద్భుతం చేసిన టీమిండియా.. రెండో టెస్టులో ఘనవిజయం!
Advertisement

తాజా వార్తలు