ఈ మధ్యకాలంలో చాలామంది భార్య భర్తల మధ్య అనుబంధలు చాలా బలహీనంగా ఉన్నాయి.దీనికి కారణం ఈ బిజీ లైఫ్ మారుతున్న కాలం అని చెప్పవచ్చు.
అయితే ప్రపంచంలోనే అతి ప్రత్యేకమైనది భార్య భర్తల బంధం.ఒకప్పుడు భార్యాభర్తలు అంటే ఎంతో అన్యోన్యంగా ఒకరినొకరు బాగా అర్థం చేసుకొని తమ వైవాహిక జీవితాన్ని ఎంతో సంతోషంగా గడుపుతూ ఉండేవారు.
కానీ ఈ ఆధునిక కాలంలో ఉన్న భార్యాభర్తలు ఉద్యోగాలంటూ తమ బిజీ లైఫ్ ను తమ బిజీ లైఫ్ మధ్య తమ వైవాహిక బంధాన్ని మరిచిపోతున్నారు.
దీంతో ఒకరినొకరు పట్టించుకోకుండా మొబైల్ ఫోన్ లోనే జీవితాన్ని గడిపేస్తున్నారు.
ఇలా చేయడం వల్ల భార్యాభర్తల బంధం బలహీనం అవుతుంది.అయితే భార్య భర్తల మధ్య ఉన్న బంధాన్ని బలపరచాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.ప్రతిరోజు ఒకరితో ఒకరు ఎంత బిజీ లైఫ్ ఉన్నా కానీ మాట్లాడుకోవాలి.
ఈ బిజీ లైఫ్ లో కూడా ఒకరి కోసం ఒకరు సమయాన్ని కేటాయించాలి.
అలాగే ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవాలి.
పిల్లలు ఉద్యోగం, జీవితం, బంధుత్వం ఇలాంటివన్నీటి మధ్య మనం దంపతులు అన్నది ముందుగా గుర్తుపెట్టుకోవాలి.ఎందుకంటే మీ జీవిత భాగస్వామి కన్నా మీకు ఎక్కువైనది ఈ లోకంలో ఏదీ లేదు.
ఏ బాధ్యత ఎక్కువ కాదు కాబట్టి అన్ని బాధ్యతలు కన్నా ముందుగా మన జీవిత భాగస్వామికే ఎక్కువ సమయాన్ని కేటాయించాలి.
అలాగే మ్యారేజ్ కౌన్సిలర్ పద్మ కమలాకర్ గారు బలహీన పడుతున్న బంధాలను బలపరుచుకునేందుకు కొన్ని చిట్కాలు చెప్పారు.అవేంటంటే భార్యాభర్తలు ఇద్దరు కలిసి స్నానం చేయాలంట అలా భార్యాభర్తలు కలిసిన స్నానం చేస్తే వాళ్ళ మధ్య మంచి అనుబంధం ఏర్పడుతుందట.ఒకరికొకరు మానసికంగా శారీరకంగా దగ్గరవుతారు.
అలాగే వారిద్దరి మధ్య మనస్పర్ధలు తగ్గే అవకాశం ఉంటుందని అందుకే బెడ్ రూమ్ లోనే కాకుండా బాత్రూం లోను కూడా మంచి అనుబంధంతో ఉండడంవల్ల భార్యాభర్తల మధ్య ప్రేమ అనురాగాలు ఎప్పుడూ ఉంటాయి.