నేను సినిమాల్లో నటించడం మానేసినప్పుడు చిరంజీవి పిలిచి అలా అన్నాడు...

తెలుగులో ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఫిదా చిత్రంలో హీరోయిన్ తండ్రి పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించిన టాలీవుడ్ ప్రముఖ నటుడు సాయి చంద్ గురించి సినిమా ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

 అయితే నటుడు సాయి చందు మొదట్లో టాలీవుడ్ లో పలు చిత్రాలలో హీరోగా నటించాడు.

 కానీ పలు కారణాల వల్ల కొంతకాలం పాటు సినిమాలలో నటించడం మానేసాడు.అయితే తాజాగా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొని తన సినీ ప్రస్థానం గురించి పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు.

 ఇందులో భాగంగా తాను మొదట్లో మెగాస్టార్ చిరంజీవితో కలిసి మంచు పల్లకి అనే చిత్రంలో నటించానని తెలిపాడు.అయితే తన కంటే మెగాస్టార్ ముందుగా సినిమా పరిశ్రమకు వచ్చి అప్పటికే స్టార్ హీరోగా రాణిస్తున్నాడని అయినప్పటికీ చిరంజీవి ఇతరుల పట్ల చాలా గౌరవంగా ప్రవర్తించే వాడిని తెలిపాడు.

అంతేగాక పలు వ్యక్తిగత కారణాల వల్ల తాను సినిమాల్లో నటించడం మానేసిన తరువాత మెగాస్టార్ చిరంజీవి తనని పిలిచి ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నావని అడిగాడట.అంతేగాక తనకి నటన పరంగా అనుభవంతో పాటు ఎంతో భవిష్యత్తు ఉందని కాబట్టి మళ్ళీ సినిమాల్లో నటించమని ప్రోత్సహించాడని తెలిపాడు.

Advertisement

ఇక సినిమా సెట్ లో వరుణ్ తేజ్ కూడా చాలా సంస్కార వంతంగా మెలగుతాడని ఆ విషయం తనకు బాగా నచ్చిందని తెలిపాడు.అలాగే చిన్నప్పుడు వరుణ్ తేజ్ తన తండ్రి నాగబాబుతో కలిసి క్లబ్ కి స్విమ్మింగ్ కోసం వచ్చేవాడిని అప్పటి నుంచే తనకు తెలుసని చెప్పుకొచ్చాడు.ఇక సాయి పల్లవి విషయానికి వస్తే చాలా అనుకువ ఉన్నటువంటి నటి అని అంతేగాక పెద్దలతో ఎలా ప్రవర్తించాలనే విషయాలు తనకు బాగా తెలుసని అందువల్లనే తనతో సెట్లో చాలా చనువుగా మరియు సరదాగా ఉండే వాళ్ళని తెలిపాడు.

 అంతేగాక సాయిపల్లవి కూడా తనని నాన్న పిలిచేదని తెలిపాడు.అయితే ఈ విషయం ఇలా ఉండగా ఫిదా చిత్రంతో సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించిన సాయి చంద్ వరుస అవకాశాలతో బాగానే రాణిస్తున్నాడు.

ఇటీవలే సాయి చాంద్ తెలుగులో ఉప్పెన, చెక్ తదితర చిత్రాలలో నటించాడు.కాగా ప్రస్తుతం తెలుగులో ప్రముఖ హీరో రానా దగ్గుబాటి మరియు సాయి పల్లవి నటిస్తున్న విరాట పర్వం చిత్రంలో ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తున్నాడు.

సూర్య కంగువ సినిమా మీద ఫోకస్ చేసిన అమీర్ ఖాన్...కారణం ఏంటంటే..?

Advertisement

తాజా వార్తలు