ఉదయ్ కిరణ్ భార్య ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా?

హీరో ఉదయ్ కిరణ్ ను గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

అతను చనిపోయి కొన్ని సంవత్సరాలు కావస్తున్నా, తన అభిమానులకు ఉదయ్ కిరణ్ ఇప్పటికీ గుర్తున్నాడు.

ఒకప్పుడు సూపర్ హిట్ సినిమాలలో నటించిన ఉదయ్ కిరణ్ తరువాత తనకు అవకాశాలు రావడం చాలా వరకు తగ్గిపోయాయి.అయితే కొన్ని కారణాల వల్ల తను ఆత్మహత్య చేసుకొని చనిపోయిన సంగతి అందరికీ తెలిసినదే.

అయితే ప్రస్తుతం ఉదయ్ కిరణ్ భార్య ఏం చేస్తుందో తెలుసా.మెగాస్టార్ చిరంజీవికి అల్లుడు కావాల్సిన ఉదయ్ కిరణ్ కొన్ని కారణాల వల్ల ఆ పెళ్లి జరగలేదు.

ఎన్నో హిట్ చిత్రాలను అందుకుని మోస్ట్ వాంటెడ్ హీరోగా రాణిస్తున్న సమయంలో, ఉదయ్ కిరణ్ కి ఒక్కసారిగా అవకాశాలు తగ్గిపోయాయి.అంతేకాకుండా ఉదయ్ కిరణ్ నటించిన సినిమాలు కూడా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి.

Advertisement

సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి ఎత్తుపల్లాలు సహజమేనని భావించిన ఉదయ్ కిరణ్ వరుసగా తన సినిమాలు ఫ్లాప్ అవుతున్నా పెద్దగా పట్టించుకోకుండా తన ప్రయత్నాలు తాను చేస్తున్నాడు.ఉదయ్ కిరణ్ ఒకరోజు తన ఫ్రెండ్ ఇచ్చిన పార్టీకి వెళ్లడంతో అక్కడ విషిత తో పరిచయం ఏర్పడుతుంది.

ఆ పరిచయం కాస్తా వారిద్దరి మధ్య ప్రేమగా చిగురించి పెద్దల సమక్షంలో వీరిద్దరి పెళ్లి జరిగింది.అయితే వృత్తిరీత్యా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కావడంతో పెళ్లయిన తర్వాత కూడా తను ఉద్యోగం చేస్తుండేది.

విషితకు ఉదయ్ కిరణ్ అంటే ఎంతో ప్రేమ ఉండటంవల్ల తనకు సినిమా అవకాశాలు రాకపోయినా వీరిద్దరి మధ్య ఎంతో అన్యోన్యత ఉండేది.డిప్రెషన్లో ఉన్న ఉదయ్ కిరణ్ ను ఎంతోమంది యోగా టీచర్ల దగ్గరకు, సైకియాట్రిస్ట్ లకు తీసుకెళ్లి ట్రీట్మెంట్ కూడా ఇప్పించింది.

కొద్దిరోజులకు సాధారణ స్థితికి వచ్చిన ఉదయ్ కిరణ్ ఇంట్లో విషిత లేని సమయం చూసి ఆత్మహత్య చేసుకున్నాడు.దీంతో విషిత తీవ్ర శోకంలో మునిగిపోయింది.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

అయితే ప్రస్తుతం ఉదయ్ కిరణ్ చనిపోయాక విషిత ఏం చేస్తుందనేది చాలామందికి తెలియదు.ఈ విషయంపై ఎవరికి నచ్చినట్టు వారు ఊహించుకొని చెబుతున్నారు.

Advertisement

కానీ విషిత ఉదయ్ కిరణ్ మరణం తర్వాత తన ఉద్యోగాన్ని కొనసాగిస్తూ లక్షల్లో జీతం తీసుకుంటున్నారు.తన ఆఫీసులో తన సహా ఉద్యోగులు చెబుతున్న సమాచారం ప్రకారం విషిత తన జీవితంలో ఎక్కువ భాగం అనాధ శరణాలయాలు డొనేట్ చేస్తున్నారని తెలిసింది.

అంతేకాకుండా వీకెండ్ రోజులలో విషిత ఎక్కువగా ఎన్జీవో సంస్థలతో కలసి అనాధ శరణాలయాలకు వెళ్తుందని చెబుతున్నారు.ఇంత మంచి సేవా గుణం ఉన్న అమ్మాయిని ఉదయ్ కిరణ్ మిస్ చేసుకోవడం ఎంతో దురదృష్టము.

తాజా వార్తలు