యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్( Prabhas ) నటించిన ఆదిపురుష్ సినిమా( Adipurush Movie ) ఈ నెల 16వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.దాదాపు 185 కోట్ల రూపాయలకు ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు తెలుగు లో విడుదల చేసేందుకు రైట్స్ కొనుగోలు చేయడం జరిగింది.
మళ్లీ వారు ఏరియాల వారీగా డిస్ట్రిబ్యూటర్ల ను ఎంపిక చేసుకుంటూ వారికి అమ్మడం జరుగుతుంది.నైజాం ఏరియా ను ఏకంగా రూ.55 కోట్ల రూపాయలకు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు అమ్మినట్లుగా సమాచారం అందుతుంది.ఇక ఈ సినిమా యొక్క నైజాం ఏరియా రైట్స్ ని దిల్ రాజు( Producer Dil Raju ) కొనుగోలు చేస్తే బాగుంటుందని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఆయన భారీ ఎత్తున విడుదల చేసే అవకాశం ఉండేది.తద్వారా భారీగా సినిమాకు ఓపెనింగ్స్ వచ్చేవి అంటూ ప్రభాస్ అభిమానులు మాట్లాడుకుంటున్నారు.కానీ ఆయన శాకుంతలం సినిమా కారణంగా చాలా నష్ట పోయాడు.పైగా ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వం లో భారీ బడ్జెట్ మూవీ గేమ్ ఛేంజర్ సినిమా ని నిర్మిస్తున్నాడు.
మరో వైపు తమిళం లో ఒక భారీ బడ్జెట్ సినిమా ను ప్లాన్ చేస్తున్నాడు.ఇలాంటి సమయంలో ఆదిపురుష్ వంటి సినిమా ను తీసుకొని.దాన్ని పంపిణీ చేయడం ఆర్థికంగా రిస్క్ తో కూడుకున్నది గా దిల్ రాజు భావించాడట.అందుకే సినిమా ను ఇష్టపడ్డా కూడా డిస్ట్రిబ్యూట్ చేసేందుకు ముందుకు రాలేదని తెలుస్తోంది.
ఇటీవల దిల్ రాజు సన్నిహితుల వద్ద మాట్లాడుతూ ఆదిపురుష్ సినిమా తనకు నచ్చిందని.కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సినిమా ను డిస్ట్రిబ్యూట్ చేసేందుకు ముందుకు వస్తే కచ్చితంగా తన నిర్మాణం లో రూపొందుతున్న సినిమా ల నిర్మాణం పై ప్రభావం పడే అవకాశాలు ఉంటాయని అందుకే తాను ఆదిపురుష్ సినిమా నచ్చినప్పటికీ దూరంగా ఉన్నాను అంటూ చెప్పుకొచ్చాడట.పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు మాత్రం దిల్ రాజు కనీసం ఒక్క ఏరియా లో అయినా రైట్స్ తీసుకుని ఉంటే బాగుండేది అన్నట్లుగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారట.
తాజా వార్తలు