సినీ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో విడాకుల తీసుకొని విడిపోవడం అన్నది సర్వసాధారణం అయిపోయింది.ఏళ్లపాటు ప్రేమించి పెళ్లి చేసుకున్న కొన్ని జంటలు పెళ్లయి కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత కొన్ని కారణాల వల్ల విడాకులు తీసుకుని విడిపోతున్నారు.
అయితే ప్రేమ, పెళ్లి, విడాకులు అన్న విషయం ఇండస్ట్రీలో కామన్ గా మారిపోయింది.ఇప్పటికే పలువురు జంటలు విడాకులు తీసుకుని విడిపోయిన విషయం తెలిసిందే.
ఇందులో టాలీవుడ్ జంట సమంత, నాగచైతన్య విడిపోయినప్పుడు అభిమానులు ఆ వార్తను జీర్ణించుకోలేకపోయారు.ఆ తర్వాత కోలీవుడ్ హీరో ధనుష్, ఐశ్వర్య విడిపోవడం అభిమానులను తీవ్రంగా కలిచి వేసింది.
అయితే సమంత నాగచైతన్య విడిపోయినప్పుడు ఎలా అయితే కొన్ని నెలల వరకు మళ్ళీ కలుస్తారు అన్న నమ్మకంతో ఉన్నారో, ఐశ్వర్య, ధనుష్ విషయంలో కూడా అభిమానులు ఎప్పటికైనా మళ్లీ కలుస్తారు అన్న ఆశలు పెట్టుకున్నారు.ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త తెగ చెక్కర్లు కొడుతోంది.
అదేమిటంటే ఐశ్వర్య, ధనుష్ దంపతుల విషయంలో అభిమానులు ఏదైతే ఆశలు పెట్టుకున్నారో అది నెరవేరబోతోంది అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.ఈ జంట వారి విడాకులను రద్దు చేసుకోబోతున్నారు అంటూ కోలీవుడ్ సినీ వర్గాలలో వార్తలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.
మరి ఈ వార్తల్లో నిజానిజాలు తెలియాలి అంటే ఐశ్వర్య దంపతులు అధికారికంగా ప్రకటించే వరకు వేచి చూడాల్సిందే మరి.
కాగా ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.అయితే వీరి పెద్దలు వారిద్దరినీ కూర్చోబెట్టి మాట్లాడారని, వారి పిల్లల కోసం అయినా కలిసి ఉండాలని చెప్పడంతో వారిద్దరు కన్విన్స్ అయినట్టు తెలుస్తోంది.ఇదే విషయాన్ని త్వరలోనే ప్రకటించబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
కాగా ఐశ్వర్య రజినీకాంత్, ధనుష్ ని ప్రేమించిన విషయం తెలిసిందే.ఆ తర్వాత తన తండ్రి రజనీకాంత్ ని ఒప్పించి మరీ పెళ్లి చేసుకుంది ఐశ్వర్య.
ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.పెళ్లి అయిన తర్వాత దాదాపు 18 ఏళ్లపాటు వైవాహిక జీవితాన్ని గడిపిన ఈ జంట ఆ తర్వాత చిన్న చిన్న గొడవల కారణంగా విడిపోతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.