రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla ) దక్షిణ కాశిగా ప్రసిద్ధి గాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారి ఆలయానికి( Vemulawada Temple ) ఆదివారం భక్తులు పోటెత్తారు.స్వామివారికి అర్చక స్వాములు వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
స్వామివారికి ఇష్టమైన కోడె మొక్కులతో పాటు ఇతర మొక్కులు చెల్లించుకున్నారు.ముందుగా భక్తులు పుష్కరిణీ పుణ్య స్నానాలు ఆచరించి స్వామి వారి సేవలో తరించారు.