విలువైన వస్తువులకు బదులుగా వారి ఇంట్లోకి కావాల్సినవి మాత్రమే కొట్టేశారట.. క్రేజీ దొంగలు!

వీరెవరో చాలా క్రేజీ దొంగల్లా ఉన్నారు.ఈ వీడియో చూస్తే మీకూ అదే అనిపిస్తుంది.

ఎందుకంటే విలువైన వస్దువులు, డబ్బుకు బదులుగా ఆ దొంగలు.కేవలం తమ ఇంట్లోకి కావాల్సిన వస్తువులను మాత్రమే దోచుకెళ్లారు.

అయితే ఇందతా సీసీ టీవీ కెమెరాల్లో రికార్డు అయింది.ఈ ఘటన కేరళ త్రిస్పూర్ లోని ఓ దుకాణంలో జరిగింది.

ఇంత వంత చోరీ జరగడం ఇదే మొదటి సారి అనుకుంటా.అసలేం జరిగిందో మనం ఇప్పుడు చూద్దాం.

Advertisement

దుకాణంలో చొరబడ్డ ఇద్దరు దొంగలు.విలువైన వస్తువులకు బదులుగా తమ ఇంట్లోకి కావాల్సిన సామాన్లను మాత్రమే దోచేశారు.

గ్లాస్ టాప్ గ్యాస్ స్టౌ, టేబుల్ మ్యాట్లు, గొడుగు, స్టీల్ గిన్నెలు, ఓ కుక్కర్ వంటి వస్తువులను తీసుకెళ్లారు.అయితే వారి ఇంట్లో ఏమేం లేవో ఓ చిట్టా రాసుకొని ముందగానే బట్టీ పట్టుకొని వచ్చారు కాబోలు.

అవి మాత్రమే తీసుకెళ్లారు.వారికి కావాల్సినవన్నీ తీసుకున్నాక.

క్యాష్ కౌంటర్ ఓపెన్ చేసి అందులోంచి మూడు వేల రూపాయల నగదుతో పాటు సెల్ ఫోన్ ను కూడా ఎత్తుకెళ్లిపోయాడు.ఆ తర్వాత వీటన్నిటిని ఆ ప్యాసింజర్ అటోలో నింపి పారిపోయారు.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
వైరల్ వీడియో : క్యాబ్ డ్రైవర్ తో హీరో గొడవ..

అయితే మరుసటి రోజు ఉదయం దుకాణం ఓపెన్ చేసిన యజమాని చోరీ జరిగినట్లు గుర్తించాడు.సీసీటీవీ పుటేజీ తనిఖీ చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

Advertisement

అయినే యజమాని ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తాజా వార్తలు