సీపీఎం నేత ఇంట్లో విషాదఛాయలు.. కరోనాతో మరణించిన ఆయన కుమారుడు.. !

దేశంలో తిష్టవేసిన కరోనా వైరస్ వల్ల ఎప్పుడు ఎవరిని మృత్యువు కబళిస్తుందో గ్రహించడం కష్టంగా మారింది.

అప్పటి దాక కళ్ల ముందు ఉన్న వారు అకస్మాత్తుగా మరణించడం, కనీసం మరణించిన వారి మృతదేహాన్ని కళ్లారా చూసే అవకాశం కూడా లేకపోవడం దురదృష్టకరమైన విషయం.

ఇక ఇప్పటికే ఈ మాయదారి రోగం బారిన పడి ఎందరో రాజకీయ ప్రముఖులు మరణించిన విషయం తెలిసిందే.ఒక రంగం అని లేకుండా అన్ని రంగాల వారిని దశల వారిగా పలకరిస్తున్న కరోనా వల్ల జరుగుతున్న నష్టం అంచనా వేయడం కూడా కష్టంగా మారింది.

ఇదిలా ఉండగా ఈ కరోనా కాటుకు సీపీఎం నేత సీతారాం ఏచూరి కుమారుడు ఆశిష్ కన్నుమాశాడు.సీనియర్ జర్నలిస్ట్ గా పనిచేస్తున్న ఆశిష్ ఈ రోజు ఉదయం గురుగ్రామ్ మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడినట్లుగా సమాచారం.

ఇకపోతే తెలంగాణలో ఈ మధ్య కాలంలో కరోనా వరుసగా జర్నలిస్టుల ప్రాణాలను ప్రసాదంగా తీసుకుంటుంది.దీని బారిన పడుతున్న జర్నలిస్టులు ఏకంగా ప్రాణాలు కోల్పోతుండటం విషాదకరం.

Advertisement
నాగార్జున 100 వ సినిమా కథను అందిస్తున్న యంగ్ రైటర్స్...

తాజా వార్తలు