CPI Narayana Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పై సీపీఐ నారాయణ సీరియస్ కామెంట్స్..!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల విశాఖపట్నంలో ప్రధాని మోడీతో భేటీ కావడం తెలిసిందే.ఆ భేటీ అనంతరం పొత్తుల విషయంలో పవన్ చాలా సైలెంట్ అయిపోయినట్లు వార్తలు వస్తున్నాయి.

 Cpi Narayana Serious Comments On Pawan Kalyan Cpi Narayana, Pawan Kalyan, Bjp, M-TeluguStop.com

ఈ క్రమంలో ఏపీలో పొత్తుల విషయంలో పవన్ పై సీపీఐ నారాయణ సీరియస్ వ్యాఖ్యలు చేశారు.ఇష్టం ఉన్నా లేకపోయినా వచ్చే ఎన్నికలకు టిడిపి, జనసేన ఇక వామపక్ష పార్టీలు కలిసి ముందుకెళ్లాలని తేల్చి చెప్పారు.

ఈ రకంగా ముందుకెళ్తేనే రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుందని స్పష్టం చేశారు.విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది.

రాష్ట్రంలో బిజెపి మరియు వైసీపీ కలిసి పనిచేస్తున్నాయని నారాయణ ఆరోపించారు.ప్రధాని మోడీతో భేటీ తర్వాత పవన్ కళ్యాణ్.ఎందుకు సైలెంట్ గా ఉన్నారని ప్రశ్నించారు.గతంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వబోనని చెప్పిన పవన్… ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉండిపోయారని నిలదీశారు.

ప్రజలను మోడీ మరియు జగన్ ప్రభుత్వాలు దోచుకుంటున్నాయని ఆరోపించారు.వీళ్ళ అరాచకాలకు అడ్డుకట్ట వేయాలంటే వామపక్షాలు మరియు జనసేన, టిడిపి కలిసి ఎన్నికలలో ముందుకెళ్లటం తప్ప మరొక మార్గం లేదని.

సీపీఐ నారాయణ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube