ఈనెల 21న కలెక్టర్ లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం..!!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి.( CM Revanth Reddy ) చాలా కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.

 Cm Revanth Reddy Meeting With Collectors On Tweenty First Of This Month Details,-TeluguStop.com

ఈనెల 21న అన్ని జిల్లాల కలెక్టర్ లతో( District Collectors ) ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించడానికి రెడీ కావడం జరిగింది.ఈ సందర్భంగా కలెక్టర్ లు సిద్ధంగా ఉండాలని సీఎం ఆదేశించారు.

ఈ సమావేశంలో కొత్త రేషన్ కార్డులు, మహాలక్ష్మి పథకం అమలు, భూ రికార్డుల సమస్యలు, కౌలుదారుల గుర్తింపు సహా మరికొన్ని అంశాలపై చర్చించనున్నారు.ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించాక కలెక్టర్ లతో తొలిసారి సమావేశం నిర్వహిస్తుండటంతో మరికొన్ని ప్రభుత్వ పాలసీలపై( Government Policies ) చర్చించే అవకాశం ఉంది.

ముఖ్యమంత్రిగా రేవంత్ ఒకపక్క ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ మరొక పాలన పరంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.గత ప్రభుత్వ సమయంలో జరిగిన అన్ని విషయాలను వెలికి తీస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై శ్వేత పత్రం విడుదల చేయడానికి కూడా సిద్ధమవుతున్నారు.2014 నుంచి 2023 వరకు బిఆర్‌ఎస్( BRS ) ప్రభుత్వంలో ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై శ్వేతపత్రం సిద్ధం చేయబోతున్నారు.ఈ క్రమంలో ఇటీవల అసెంబ్లీ సమావేశాలలో కొన్ని విషయాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.బీఆర్ఎస్ పార్టీ నేతలపై విమర్శలు చేయడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube