తిరుపతిలో సినిమా తరహాలో గంజాయి అక్రమ రవాణా

తిరుపతిలో అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు.సూళ్లూరుపేటలో వాహనాల తనిఖీలలో భాగంగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

పుష్ప సినిమా తరహాలో బొలెరో ట్రక్ వాహనం పైభాగంలో కూరగాయలు, కింద భాగంలో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.సుమారు రూ.48 లక్షల విలువ చేసే 240 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.ఐదు సెల్ ఫోన్లతో పాటు బొలెరో ట్రక్, ఇన్నోవా వాహనాన్ని సీజ్ చేశారు.

అదేవిధంగా నిందితులు అందరూ తమిళనాడుకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.

ఫేక్ వీడియోలతో కాంగ్రెస్ తప్పుడు ప్రచారం.. : అమిత్ షా
Advertisement

తాజా వార్తలు