ఉక్రెయిన్, రష్యా యుద్ధం గురించి గత కొన్ని రోజులుగా వింటూనే ఉన్నాం.అసలు రష్యా భయంకరమైన రీతిలో ఉక్రెయిన్ పై విరుచుకు పడుతుంది.
రష్యా దాటికి అక్కడి నగరాలు గుర్తు పట్టలేని స్థితికి చేరుకున్నాయి.ఇక భవనాలు అయితే ఎక్కడికక్కడ ధ్వంసం అవుతున్నాయి.
ఉక్రెయిన్ లో మన భారతీయులు చాలా మంది ఉన్న విషయం విదితమే.
మన అధికారులు వీరిని ఆపరేషన్ గంగ పేరుతో స్వదేశానికి తీసుకు వస్తున్నారు.
ఇప్పటికే చాలా మందిని సురక్షితంగా ఇక్కడికి తీసుకు వచ్చారు.అయినా కూడా ఇంకా వేల మంది భారతీయులు అక్కడే చిక్కుకుని ఉన్నారు.
అయితే కొంత మంది అక్కడ నుండి వదలలేక రాలేక పోతుంటే.మరి కొంతమంది మాత్రం కదలలేని స్థితిలో ఉండి రాలేక పోతున్నారు.
ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి కూడా అక్కడి నుండి రాలేక పోతున్నానని అందుకు గల కారణాలు వివరిస్తూ వీడియో షేర్ చేసాడు.అది కాస్త ఇప్పుడు నెట్టింట వైరల్ అయ్యింది.
ఆయన ఏపీ కి చెందిన వైద్యుడు.
ఆయన పేరు డాక్టర్ గిరి కుమార్.ఈయన మెడిసిన్ అక్కడే చదివి అక్కడే స్థిరపడ్డాడు.అయితే ఆయన అక్కడ ఒక జాగ్వార్, పాంథర్ ను పెంచుకుంటున్నాడట.
వాటి కారణంగానే అతడు ఇండియాకి రావడం లేదని వీటిని వదిలేస్తే తిండి లేక చచ్చిపోతాయని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు.అందుకే వీటిని వదలలేక ఆయన అక్కడే ఉన్నానని తెలిపారు.
ఈయన లంకేశ్వరుడు సినిమా చూసి మూగజీవాలను పెంచుకుంటున్నట్టు తెలిపారు.ఈ వీడియో చూసిన నెటిజెన్స్ ఆయనకు హ్యాట్సాఫ్ చెబుతున్నారు.
ఈ వీడియోపై తాజాగా మెగాస్టార్ స్పందించారు.”ప్రియమైన డాక్టర్ గిరికుమార్.జాగ్వార్, పాంథర్ లపై మీకున్న ప్రేమ నన్ను టచ్ చేసింది.నాలో స్ఫూర్తిని నింపింది.ఉక్రెయిన్ లో ప్రెసెంట్ నెలకొన్న పరిస్థితుల్లో కూడా ఇండియాకు రాకుండా వాటికోసం అక్కడే ఉండాలని అనుకోవడం నిజంగా హృదయానికి హత్తుకునే విషయం.మీరు సురక్షితంగా, క్షేమంగా ఉండాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను అంటూ ఎమోషనల్ ట్వీట్ చేసాడు.
ఆ ట్వీట్ ఇప్పుడు వైరల్ అయ్యింది.