ఈసారి సంక్రాంతి కానుకగా దుమ్ములేచిపోయే సినిమాలు రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే.ప్రతీ ఏడాది లాగా ఈసారి స్టార్ హీరోలు కాకుండా సీనియర్ స్టార్ హీరోలు పోటీ పడబోతున్నారు.
మరి అందులో ఒకరు నందమూరి బాలకృష్ణ కాగా.మరొకరు మెగాస్టార్ చిరంజీవి.
దీంతో ఈ ఇద్దరి స్టార్ హీరోల మధ్య తీవ్ర పోటీ ఎదురవుతుంది.
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ చాలా ఏళ్ల తర్వాత పోటీ పడబోతున్న నేపథ్యంలో ఈ పోటీ ఇప్పుడు మరింత ఆసక్తిగా మారిపోయింది.
ఈ ఇద్దరు హీరోలు కూడా తమ సినిమాలపై చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నారు.బాబీ దర్శకత్వంలో చిరు వాల్తేరు వీరయ్య, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య వీరసింహ రెడ్డి సినిమా చేస్తున్నారు.
వీరసింహారెడ్డి జనవరి 12న, వాల్తేరు వీరయ్య జనవరి 13న రిలీజ్ కాబోతున్నాయి.ఇప్పటికే ఈ రెండు సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కూడా గ్రాండ్ గా ముగిసాయి.ట్రైలర్స్ కూడా ఇప్పటికే రిలీజ్ అయ్యి మంచి ఆసక్తి రేపాయి.దీంతో ఈ ఇద్దరు హీరోలు ఏమాత్రం తగ్గకుండా తమ సినిమాలపై కాన్ఫిడెంట్ గా ఉన్నారు.
అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఈ రెండు సినిమాలకు బాగా జరుగుతున్నాయి.ఇక ఈ రెండు సినిమాలను కూడా మైత్రి మూవీ మేకర్స్ నే నిర్మించింది.అలాగే ఈ రెండు సినిమాల్లో కూడా శృతి హాసన్ నే హీరోయిన్ గా నటిస్తుంది.ఒక్కరోజు తేడాతో ఈ రెండు భారీ బడ్జెట్ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.
చూడాలి ఈ ఏడాది ఎవరు విన్ అవుతారో.