ఏపీ రాజ్‎భవన్‎లో 'ఎట్ హోమ్' కార్యక్రమానికి చంద్రబాబు

సీఎం జగన్ తో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు ఒకే వేదిక‌ను పంచుకోనున్నారు.

స్వాతంత్య్రం దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని ఏపీ రాజ్ భ‌వ‌న్ లో గ‌వ‌ర్న‌ర్ ఎట్ హోమ్ కార్య‌క్రమం నిర్వ‌హిస్తున్నారు.

ఈ తేనిటీ విందు కార్య‌క్ర‌మానికి హాజ‌రు కావాలంటూ టీడీపీ అధినేత‌కు ఆహ్వానం వ‌చ్చింది.అయితే టీడీపీ ప్ర‌తిప‌క్షంలోకి వ‌చ్చాక ఎట్ హోమ్ కార్య‌క్ర‌మానికి రావ‌డం ఇదే మొద‌టిసారి.

చంద్ర‌బాబు స్వ‌యంగా ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రుకానుండ‌టంతో అంద‌రి దృష్టి రాజ్ భ‌వ‌న్ వైపే మ‌ళ్లింది.ఇటీవ‌ల ఢిల్లీలో ప్ర‌ధాని మోదీతో చంద్ర‌బాబు ప్ర‌త్యేకంగా మాట్లాడిన స‌మ‌యంలోనూ మీడియా దృష్టిని సారించింది.

తాజాగా రాజ్ భ‌వ‌న్ లో సీఎం జ‌గ‌న్ తో క‌లిసి ఒకే వేదిక పంచుకోనుండ‌డంతో స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది.

Advertisement
పెన్షన్ల విషయంలో చంద్రబాబు రాజకీయం.. : సీఎం జగన్

తాజా వార్తలు