మూలధన వ్యయం కోసం రాష్ట్రాలకు ప్రత్యేక సాయం పథకం కింద తొలివిడత నిధులను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసింది.ఈ పథకం కింద తెలంగాణ సహా 8 రాష్ట్రాలకు చెందిన క్యాపిటల్ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది.వీటి విలువ రూ.2,903.80 కోట్ల కాగా em>దీనిలో రూ.1,393.83 కోట్లు విడుదల చేసింది.ఈ ప్రాజెక్టులు 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించినవి.
కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ శనివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం ఈ పథకం కింద 50 సంవత్సరాల పాటు వడ్డీలేని రుణాలను రాష్ట్రాలకు కేంద్రం అందిస్తుంది.మూలధన వ్యయం కోసం రూ.15 వేల కోట్ల వరకు రుణాలను 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఇస్తుంది.ఈ పథకం కింద ప్రారంభంలో తెలంగాణ, బీహార్, సతీష్ గడ్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, సిక్కిం లబ్ధి పొందుతున్నాయి.
మూలధన వ్యయంకి సంబంధించిన అయ్యర్ మల్టీప్లేయర్ ఎఫెక్ట్ దృష్ట్యా కోవిడ్-19 మహమ్మారి రెండు ప్రభంజనంతో రాష్ట్రాలకు చాలా అవసరమైన వనరులను అందజేయడం కోసం ఈ పథకాన్ని ఈ ఏడాది ఏప్రిల్ 29న ప్రవేశపెట్టినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.ఈ పథకంలో భాగంగా రూ 2,600 కోట్లు వరకు ఈశాన్య కొండ ప్రాంత రాష్ట్రాలకు అందజేస్తారు.దీనిలో రూ.400 కోట్ల చొప్పున అసోం, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ పొందుతాయి.

ఈ గ్రూపులో మిగిలిన రాష్ట్రాలకు రూ.200 కోట్లు చొప్పున ఇస్తారు.దాదాపు రూ.7,400 కోట్లు మిగిలిన రాష్ట్రాలకు అందజేస్తారు.2021-22 ఆర్థిక సంవత్సరానికి 15వ ఆర్థిక సంఘం అవార్డు ప్రకారం కేంద్ర పన్నుల్లో వాటా దామాషాలో రాష్ట్రాలకు రుణాలు అందజేస్తారు.నగరీకరణ/ మౌలికసదుపాయాల ఆస్తుల రీసైక్లింగ్ స్టేట్ పుౠస్ఈల పెట్టుబడుల ఉపసంహరించుకునే రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు అందజేయడం కోసం రూ.5,000 కోట్లు కేటాయించారు.