అనంతపురం కలెక్టరేట్‎కు సీఈసీ ప్రిన్సిపల్ సెక్రటరీ..!

అనంతపురం కలెక్టరేట్‎కు కేంద్ర ఎన్నికల సంఘం ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ కుమార్ చేరుకున్నారు.

ఉరవకొండలో జరిగిన ఓట్ల తొలగింపుపై విచారణ నిమిత్తం ఆయన కలెక్టరేట్‎కు వచ్చినట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో అక్కడి అధికారులతో ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ కుమార్ భేటీ అయ్యారు.అనంతరం విడపనకల్లు మండలం చీకలగురికి గ్రామానికి వెళ్లారు.

కాగా నియోజకవర్గంలో జరిగిన ఓట్ల తొలగింపు చర్యలపై కేంద్ర ఎన్నికల సంఘం అధికారులకు ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ వివరించారు.అనంతరం అధికారులకు ఆయన వినతిపత్రం ఇచ్చారు.

అయితే టీడీపీ సానుభూతిపరుల ఓట్ల తొలగింపుపై ఎమ్మెల్యే ఈసీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.ఓట్ల అక్రమ తొలగింపుపై పలుమార్లు ఫిర్యాదు చేసినా జిల్లా అధికారులు పట్టించుకోలేదని, విచారణ పేరుతో జాప్యం చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

Advertisement
ఆయన మరణ వార్త చదువుతూ ఏడ్చేసిన యాంకర్..

తాజా వార్తలు