ప్రవళిక మృతి కేసులో రాజకీయ నేతలపై కేసులు..!

ప్రవళిక మృతి కేసులో మరో ట్విస్ట్ నెలకొంది.ఈ ఘటనలో కొందరు రాజకీయ నేతలపై కేసులు నమోదు అయ్యాయని తెలుస్తోంది.

ప్రవళిక ఆత్మహత్యపై ఆందోళన కార్యక్రమం నిర్వహించిన 13 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారని సమాచారం.అయితే ప్రవళిక ఆత్మహత్యకు పాల్పడటానికి గ్రూప్ -2 పరీక్ష వాయిదా పడటమే కారణమని ఆరోపిస్తూ నేతలు ఆందోళన చేసిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో సదరు నాయకులపై 143, 148, 341, 332 ఆర్/డబ్ల్యూ 149 సెక్షన్ల కింద చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు అయ్యాయని తెలుస్తోంది.అయితే ప్రవళిక మృతికి శివరామ్ వేధింపులే కారణమని ఆమె కుటుంబ సభ్యులు చెబుతుండగా పోలీసులు ప్రేమ వ్యవహారం కారణంగా బలవన్మరణానికి పాల్పడిందని వెల్లడించిన సంగతి తెలిసిందే.

మన ఇంటి ఆనంది మనోళ్లకు పెద్దగా నచ్చలేదు.. జాంబిరెడ్డి హీరోయిన్ ఆనంది గురించి ఆసక్తికర విషయాలు
Advertisement