భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో యువకుడి దారుణ హత్య..!

ప్రస్తుత సమాజంలో మనిషి ప్రాణాలకు రోజు రోజుకు విలువ తగ్గుతూ పోతుంది.గతంలో ఏమైనా సమస్యలు ఉంటే కూర్చుని పరిష్కరించుకునేవారు.

కానీ ప్రస్తుతం ఏవైనా సమస్యలు ఉంటే పగలు, ప్రతీకారాలు పెంచుకొని ఏకంగా మనిషి ప్రాణాలనే తీసేస్తున్నారు.భవిష్యత్తులో మనిషి జీవన విధానం ఎలా ఉంటుందో అని ఊహించుకుంటేనే భయంగా ఉంటుంది.

సమాజంలో మార్పు రాకపోతే చిన్నచిన్న కారణాలకే కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితులు దగ్గర లోనే ఉన్నాయి.ఈ క్రమంలోనే ఓ యువకుడు గుర్తు తెలియని వ్యక్తుల చేతులలో దారుణ హత్యకు గురైన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది.

అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.

Advertisement

ఎస్సై రాజ్ కుమార్ ( SI Rajkumar )తెలిపిన వివరాల ప్రకారం.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు లోని నాగినేని ప్రోలు రెడ్డిపాలెం( Nagineni Prolu Reddypalem ) గ్రామానికి చెందిన 24 ఏళ్ల ఎం.నవీన్( M.Naveen ) అనే యువకుడు మంగళవారం అర్ధరాత్రి దారుణ హత్యకు గురయ్యాడు.స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్సై రాజ్ కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.

నవీన్ తలపై దాడి చేసి తల పగలగొట్టి దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.ఘటన స్థలంలో ఆధారాలు సేకరించి, స్థానికులను ప్రాథమికంగా విచారించగా.పాత కక్షల కారణంగా నవీన్ హత్య జరిగినట్లు పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు.

మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, హత్య కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు.ఈ హత్య ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే బయటకు వస్తాయని ఎస్సై రాజ్ కుమార్ తెలిపారు.

యువకుడి హత్యతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఐబ్రోస్ దట్టంగా పెరగాలా.. అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి!
Advertisement

తాజా వార్తలు