తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత కేటీఆర్( Former Minister KTR ) కీలక వ్యాఖ్యలు చేశారు.వచ్చే నెల ఒకటోవ తేదీన చలో మేడిగడ్డ( Chalo Medigadda ) నిర్వహించనున్నట్లు తెలిపారు.
బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో కలిసి కాళేశ్వరం ప్రాజెక్టు( Kaleshwaram Project ) గురించి వివరిస్తామని, నిజానిజాలను తేల్చుతామని పేర్కొన్నారు.తెలంగాణకు కామధేనువు కాళేశ్వరం ప్రాజెక్ట్ అని తెలిపారు.
కాళేశ్వరం అంటే ఒక్క మేడిగడ్డ మాత్రమే కాదని చెప్పారు.కాళేశ్వరం అంటూ మూడు బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 203 కిలోమీటర్ల టన్నెల్స్ అని స్పష్టం చేశారు.