తెలంగాణలో పోడు సర్వేపై నీలినీడలు

తెలంగాణలో పోడు సర్వేపై నీలినీడలు కమ్ముకున్నాయి.రాష్ట్రంలో పోడు సర్వే నిలిచిపోయింది.

 Blue Shadows Over Podu Survey In Telangana-TeluguStop.com

చివరి దశకు వచ్చిన సమయంలో సర్వేకు తాత్కాలికంగా బ్రేక్ పడింది.ఆయుధాలిస్తేనే పోడు సర్వేకు వెళ్తామని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు.

వరుసగా మూడో రోజూ ఫారెస్ట్ సిబ్బంది నిర్వహిస్తున్న రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.ఈ క్రమంలోనే మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు సిబ్బంది వినతిపత్రం ఇవ్వనున్నారు.

అయితే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో డిసెంబర్ 1 నుంచి పోడు హక్కు పత్రాల జారీ కష్టమేననే వాదనలు వినిపిస్తున్నాయి.పోడు సర్వే సైతం మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి.

మరోవైపు పోడు దరఖాస్తుల స్వీకరణ, గ్రామసభల నిర్వహణలో గందరగోళం నెలకొంది.అటవీ శాఖ సిబ్బంది చేస్తున్న ఆందోళనలు సర్వేపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube