తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కి తెలంగాణ పోలీసులు ఊహించని షాక్ ఇచ్చారు.విషయంలోకి వెళ్తే ఈనెల 28 నుండి డిసెంబర్ 16వ తారీకు వరకు… ఐదవ విడత ప్రజాసంఘామయాత్ర చేయటానికి బండి సంజయ్ రెడీ అవుతున్న క్రమంలో నిర్మల్ జిల్లా పోలీసులు అనుమతులు నిరాకరించారు.
భైంసా నుండి పాదయాత్ర చేయాల్సిన క్రమంలో పార్టీ నేతలు ఏర్పాట్లు చేసుకుండాగా శాంతిభద్రతల కారణాల దృష్ట్యా పోలీసులు అనుమతి నిరాకరించారు.బహిరంగ సభతో పాటు యాత్రకు భద్రత ఇవ్వలేమని పోలీసులు తెలియజేశారు.
మరోపక్క పాదయాత్ర నిర్వహించి తీరుతామని తెలంగాణ బీజేపి నేతలు అంటున్నారు.అంతేకాకుండా పాదయాత్ర పై నిర్మల్ ఎస్పీకి ముందే సమాచారం ఇచ్చామని పాదయాత్ర ఇంకా సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నామని…బీజేపీ నాయకులు అంటున్నారు.
పోలీసులు కావాలని అడ్డంకులు సృష్టిస్తున్నారని నిర్మల్ జిల్లా ఎస్పీ ఆఫీస్ దగ్గర బీజేపీ నాయకులు ఆందోళనకు దిగారు.రోడ్డుపై బైఠాయించి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉండటంతో బీజేపీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.
ఈ క్రమంలో రేపటి పాదయాత్ర కోసం బండి సంజయ్ బయలుదేరగా పోలీసులు అడ్డుకున్నారు.
దీంతో పోలీసులకి బండి సంజయ్ కి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
పాదయాత్రకి అనుమతి లేకపోవడంతో బండి సంజయ్ నీ పోలీసులు అదుపులోకి తీసుకొని జగిత్యాలకు తరలించారు. బండి సంజయ్ ఇప్పటివరకూ 4 విడతల్లో 21 జిల్లాల్లోని 1178 కిలోమీటర్ల పాటు పాదయాత్ర చేశారు.
ఐదో విడత పాదయాత్ర స్టార్ట్ చేయాలనీ అనుకున్న సమయంలో బండి సంజయ్ నీ పోలీసులు అదుపులోకి తీసుకోవడం తెలంగాణా రాజకీయాలలో సంచలనంగా మారింది .