ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు బీజేపీ ఎంపీ జీవీఎల్ లేఖ

ఏపీ గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్ కు బీజేపీ జీవీఎల్ లేఖ రాశారు.

సెక్షన్ 22- ఏ బాధితులకు న్యాయం చేయాలని గవర్నర్ ను ఆయన కోరారు.

అదేవిధంగా విశాఖ భూ కుంభకోణాలపై జోక్యం చేసుకోవాలని లేఖలో విన్నవించారు.దసపల్లా భూములు ప్రైవేట్ భూములు ఎలా అవుతాయని ఆయన ప్రశ్నించారు.

విశాఖ భూములను టిడిపి, వైసిపి దోచుకుంటున్నాయని జీవీఎల్ ఆరోపించారు.గతంలో టిడిపి కార్యాలయం పెట్టుకుని భూములు పంచారన్న జీవీఎల్.

భూ మాఫియాను కాపాడేందుకు సిట్ నివేదికను తొక్కి పెట్టారని ప్రశ్నించారు.ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం కూడా నివేదికలను బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

Advertisement
అసలు ఎందుకు ఓడారు ? త్రిసభ్య కమిటీ విచారణ

తాజా వార్తలు