మంత్రి కేటీఆర్ పై బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.కేటీఆర్ రాజకీయ విలువలు దిగజారేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
హాఫిజ్ పేట భూముల వ్యవహారంలో సుప్రీం కోర్టులో ఎందుకు అప్పీల్ పిటిషన్ వేయలేదని ప్రశ్నించారు.సర్వే నెంబర్ 77లో భూమిని హైకోర్టు ఉత్తర్వులు కాదని, ఒకరికి లాభం చేకూరేలా చేయలేదా అని నిలదీశారు.
ఈ భూమిలో అపార్ట్మెంట్ కట్టేలా అనుమతులు ఎలా ఇచ్చారో చెప్పాలన్నారు.రూ.500 కోట్లు లబ్ధి పొందిన వ్యక్తి తిరిగి మీకేం చేయలేదా అని ప్రశ్నించారు.కోర్టు సస్పెండ్ చేసిన భూమిని కూడా రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపించారు.