తిరుమల శ్రీవారిని బిజెపి నాయకులు సృజనా చౌదరి దర్శించుకున్నారు.రాత్రి తిరుమలకు వెళ్లిన ఆయన స్వామివారికి జరిగే నైవేద్యం విరామ సమయంలో ఆలయంలోకి వెళ్లి మొక్కలు చెల్లించుకున్నారు.
చాలా రోజుల తర్వాత శ్రీవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు సృజనా చౌదరి.ప్రధాని మోడీ గారి నాయకత్వంలో దేశం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు.అవినీతి రహితంగా రాష్ట్ర ప్రభుత్వాలు పాలన నిర్వహిస్తే… దేశం మరింతగా ముందు కెళ్లుతుందని పేర్కొన్నారు.