తెలంగాణ అసెంబ్లీ వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.ప్రొటెం స్పీకర్ నియామకాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు ఆందోళన కార్యక్రమం చేపట్టారు.
ఈ క్రమంలోనే అసెంబ్లీ వద్ద ఉన్న గాంధీ విగ్రహం వద్ద బైఠాయించేందుకు తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలు ప్రయత్నించారు.అయితే రంగంలోకి దిగిన పోలీసులు బీజేపీ ఎమ్మెల్యేలను అడ్డుకున్నారు.
దీంతో అసెంబ్లీ గేట్ -2 వద్ద బీజేపీ ఎమ్మెల్యేలు బైఠాయించారు.సీనియర్లు ఉన్నా ప్రొటెం స్పీకర్ గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ను పెట్టడమేంటని బీజేపీ ప్రశ్నిస్తుంది.
రజాకార్ల వారసులను ఎలా ప్రొటెం స్పీకర్ ను చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.