మన దేశీయ వంటకాలలో బిర్యానీని మించిన ఫుడ్ లేదని చెప్పొచ్చు.హైదరాబాద్ లో చేసే బిర్యానీలు ఇంకా మరింత రుచికరంగా ఉంటాయి.
బిర్యానీలకు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు.అయితే తాజాగా హైదరాబాద్ లో వచ్చిన వరదల కారణంగా పెద్ద బిర్యానీ కుండలు కొట్టుకుపోయాయి.
దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది.ఇది చూసిన బిర్యానీ లవర్స్ షాక్ అవుతున్నారు.
రెండు కుండల నిండా బిర్యానీ నీటి పాలు కావడంతో వారందరూ గుండె పగులుతున్నారు.
వైరల్ అవుతున్న వీడియోలో హైదరాబాద్లోని వీధుల్లో నీరు నిండిపోవడం చూడవచ్చు.
ఆపై నగరంలోని వరదలతో నిండిన ఒక వీధిలో రెండు బిర్యానీ గిన్నెలు తేలుతూ కనిపించాయి.వీటిలో బిర్యానీ కొద్దిగా ఉన్నట్లు తెలుస్తోంది.
హైదరాబాద్లోని అదిబా హోటల్గా ముందు ఈ దృశ్యం కనిపించింది.అయితే స్థానికులు దీనిని తమ కెమెరాల్లో బంధించి సోషల్ మీడియాలో షేర్ చేశారు.
అది కాస్తా ఇప్పుడు వైరల్ గా మారింది.
అయ్యే, పాపం.
ఎవరో ఆర్డర్ చేసుకున్న బిర్యానీ ఇలా నీళ్లలో వెళ్తోంది.వాళ్లకి ఈరోజు నిరాశే అని ఈ వీడియో షేర్ చేసిన ట్విట్టర్ యూజర్ కామెంట్ పెట్టాడు.
మరి కొందరు దీనిపై ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు.వావ్, డెలివరీ బాయ్ అవసరం లేకుండానే… దానంతట అదే డెలివరీ వెళ్ళిపోతుందని మరికొందరు సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు.
దీనికే ఇప్పటికే 11 లక్షలకు పైగా దీనికి వచ్చాయి దీనిపై మీరు కూడా ఓ లుక్కేయండి.