సాధారణంగా కొందరికి ముఖంపై నలుపు, తెలుపు, ఎరుపు, గోధుమ రంగులలో మచ్చలు ఏర్పడుతుంటాయి.కెమికల్స్ ఎక్కువగా ఉండే స్కిన్ కేర్ ప్రోడెక్ట్స్ను వాడటం, కాలుష్యం, డెడ్ స్కిన్ సెల్స్ పేరుకుపోవడం, ఆహారపు అలవాట్లు, వాతావరణంలో వచ్చే మార్పులు వంటి కారణాల వల్ల అలాంటి మచ్చలు వస్తుంటాయి.
ఇవి చూసేందుకు అసహ్యంగా కనిపించడమే కాదు.ముఖ సౌందర్యాన్ని తీవ్రంగా దెబ్బ తీస్తుంటాయి.
అందుకే వాటిని వదిలించుకోవడం కోసం ముప్ప తిప్పలు పడుతుంటారు.
అయితే ఇప్పుడు చెప్పబోయే ఎఫెక్టివ్ రెమెడీని ట్రై చేస్తే గనుక ముఖంపై ఎలాంటి మచ్చలున్నా మటుమాయం అవ్వడం ఖాయం.
మరి ఇంకెందుకు లేటు ఆ రెమెడీ ఏంటో.దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి.ముందుగా పీల్ తొలగించి నీటిలో కడిగిన బంగాళదుంపను తీసుకుని బాగా పేస్ట్ చేసి జ్యూస్ను మాత్రం సపరేట్ చేసుకోవాలి.అలాగే ఒక జాజికాయను తీసుకుని మెత్తగా దంచి పొడి చేసుకోవాలి.
ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల ముల్తానీ మట్టి, హాఫ్ టేబుల్ స్పూన్ జాజికాయ పొడి, చిటికెడు కస్తూరి పసుపు, వన్ టేబుల్ స్పూన్ పెరుగు, హాఫ్ టేబుల్ స్పూన్ తేనె, రెండు టేబుల్ స్పూన్ల బంగాళదుంప జ్యూస్ వేసి అన్నీ కలిసేలా మిక్స్ చేసుకోవాలి.
ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖం మొత్తానికి అప్లై చేసుకుని.ఇరవై నిమిషాల పాటు డ్రై అవ్వనివ్వాలి.అనంతరం కూల్ వాటర్తో శుభ్రంగా ఫేస్ వాష్ చేసుకోవాలి.
ఆపై మీ స్కిన్కి సూట్ అయ్యే మాయిశ్చరైజర్ను రాసుకోవాలి.ఇలా ప్రతి రోజు చేస్తే గనుక ఎలాంటి మచ్చలు ఉన్నా క్రమంగా తగ్గు ముఖం పట్టి ముఖం కాంతివంతంగా మరియు మృదువుగా మారుతుంది.
కాబట్టి, తప్పకుండా పైన చెప్పిన రెమెడీని ట్రే చేసేందుకు ప్రయత్నించండి.