కాంతార మూవీకి ఉత్తమ నటుడిగా రిషబ్ శెట్టికి అవార్డ్ .. ఈ నటుడికి ఎన్ని అవార్డ్స్ ఇచ్చినా తక్కువే!

2022 సంవత్సరం సెప్టెంబర్ 30వ తేదీన కర్ణాటక రాష్ట్రంలో( Karnataka ) 250 థియేటర్లలో విడుదలై కాంతార మూవీ( Kantara movie ) సృష్టించిన సంచలనాలు అన్నీఇన్నీ కావు.

ఆ తర్వాత ఇతర భాషల్లో కాంతార మూవీ డబ్ అయ్యి ఇతర భాషల్లో సైతం హిట్ గా నిలిచింది.

కేవలం 16 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా 300 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుంది అంటే ఈ సినిమా ప్రేక్షకులకు ఏ స్థాయిలో నచ్చిందో సులువుగా అర్థమవుతుంది.రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అభిమానులకు ఎంతగానో నచ్చింది.

కేంద్రం 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను ప్రకటించగా ఉత్తమ నటుడి పురస్కారం కాంతార సినిమాకు గాను రిషబ్ శెట్టికి దక్కింది.రిషబ్ శెట్టికి ఈ పురస్కారం దక్కడం సినీ అభిమానులను ఎంతో సంతోషానికి గురిచేసింది.

అయితే రిషబ్ శెట్టికు( Rishabh Shetty ) ఈ సక్సెస్ సులువుగా దక్కలేదు.జాతీయ ఉత్తమ నటుడి అవార్డు అందుకున్న ఈ నటుడు ఒకప్పుడు మినరల్ వాటర్ అమ్మారు.

Advertisement

ఒకప్పుడు అప్పు ఇచ్చినవాళ్లు ఎక్కడ గొడవ చేస్తారో అని మారువేషాల్లో తిరిగిన రిషబ్ శెట్టి కర్ణాటక రాష్ట్రంలోని కెరాడి అనే పల్లెటూర్లో మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు.డిగ్రీ పూర్తి కాకముందే ఫిలిం ఇన్స్టిట్యూట్లో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో షేర్ అండ్ రిషబ్ శెట్టి ఆ సమయంలో ఆర్థికంగా ఎవరిపై ఆధారపడకూడదని భావించి మినరల్ వాటర్ బిజినెస్ మొదలుపెట్టారు.

మొదట సైనైడ్ సినిమాకు( Cyanide ) అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరిన రిషబ్ శెట్టి ఆ సినిమా మధ్యలోనే ఆగిపోవడంతో ఇబ్బంది పడ్డారు.ఆ తర్వాత గండ హెండతి సినిమాకు క్లాప్ బాయ్ గా చేరారు.ఆ సినిమాకు ఏడాది పని చేస్తే రిషబ్ కు కేవలం 1500 రూపాయలు వేతనంగా దక్కింది.

కిరిక్ పార్టీ అనే సినిమాతో తొలి సక్సెస్ అందుకున్న రిషబ్ శెట్టి ఆ తర్వాత వరుస విజయాలతో కెరీర్ ను కొనసాగించారు.అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే సినిమాలలో నటిస్తూ రిషబ్ విజయాలను అందుకుంటున్నారు.

ప్రస్తుతం కాంతార2 సినిమాతో బిజీగా ఉన్న ఈ హీరో రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలను, అవార్డులను అందుకోవాలని ఆకాంక్షిద్దాం.రిషబ్ శెట్టికి ఎన్ని అవార్డులు ఇచ్చినా తక్కువేనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

విజయ్ సక్సెస్ సాధిస్తే ఏపీ వరకు రీసౌండ్.. నాగచైతన్య షాకింగ్ కామెంట్స్ వైరల్!
Advertisement

తాజా వార్తలు