బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా భారత్ పర్యటన కొనసాగుతోంది.పర్యటనలో భాగంగా పలువురు ప్రముఖులతో సమావేశమైన ఆమె.
తాజాగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో భేటీ అయ్యారు.ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు.
ఇరుదేశాల మధ్య వివిధ అనుసంధాన మార్గాలను అమలుచేయాల్సిన అవసరం ఉందని కిషన్ రెడ్డి తెలిపారు.అప్పుడే ఇరుదేశాల మధ్య వివిధ రంగాల్లో పరస్పర అభివృద్ధికి ఆస్కారం ఉంటుందన్నారు.
అలాగే విద్యుత్, వ్యవసాయం, తేయాకు ఎగుమతికి బంగ్లాదేశ్ రేవుల సహకారం, పర్యాటకం వంటి అంశాలపై ఇరువురు చర్చించినట్లు సమాచారం.