దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం RRR. ఈ సినిమా ఈ నెల 25వ తేదీ విడుదల కావడంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఇక ఈ సినిమా విడుదలైన తర్వాత రాజమౌళి తన తదుపరి ప్రాజెక్ట్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయనున్నట్లు ఇదివరకే ప్రకటించారు.ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే కథను రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ సిద్ధం చేసే పనిలో ఉన్నారు.
ప్రస్తుతం మహేష్ బాబు సర్కారీ వారి పాట చిత్రంతో బిజీగా ఉన్నారు.ఈ సినిమా పూర్తి కాగానే త్రివిక్రమ్ సినిమాతో మహేష్ బాబు బిజీ కానున్నారు.
ఇక త్రివిక్రమ్ సినిమా పూర్తి కాగానే మహేష్ బాబు రాజమౌళి సినిమా పట్టాలెక్కుతోంది.ఇకపోతే ఈ సినిమాలో మహేష్ బాబు సరసన అలియా భట్ నటిస్తుందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.
అయితే ఈ విషయం గురించి ఎలాంటి క్లారిటీ లేదు.ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకి సంబంధించిన మరొక సమాచారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సోషల్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ సందడి చేయనున్నట్లు సమాచారం అయితే బాలకృష్ణ ఈ సినిమాలో గెస్ట్ రోల్ మాత్రమే కాకుండా, సుమారు 20 నిమిషాల పాటు కీలక పాత్రలో ప్రేక్షకులను సందడి చేయనున్నట్లు తెలుస్తోంది.ఇక ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నందమూరి బాలకృష్ణ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.రాజమౌళి దర్శకత్వంలో తమ అభిమాన హీరోని చూడాలనుకునే కల ఈ విధంగా నెరవేరుతుంది అంటూ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.