నంద్యాల జిల్లాలో దారుణం.. కూతురిని హత్య చేసిన తండ్రి

నంద్యాల జిల్లాలో దారుణ ఘటన జరిగింది.కన్న కూతురిని అత్యంత కిరాతకంగా గొంతు కోసి చంపాడు ఓ తండ్రి.

ఈ ఘటన పాణ్యం నియోజకవర్గంలో చోటు చేసుకుంది.వివాహమై ఏడాది కావస్తున్న కాపురానికి వెళ్లడం లేదని తీవ్ర ఆగ్రహానికి గురైన తండ్రి కూతురు ప్రసన్నను గొంతు కోసి చంపేశాడు.

అనంతరం తల, మొండెంను వేరు చేసి నల్లమల ఫారెస్ట్ బోగధాలో పడేశాడు.అనంతరం పరారైయ్యాడు.

బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పాణ్యం పోలీసులు పరారీలో ఉన్న నిందితుడు కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.

Advertisement
బంతి పూలతో పాటు ఏ ఏ పూలను దేవుడి పూజ కోసం ఉపయోగించరో తెలుసా..?