బాహుబలి సినిమా హిట్ తర్వాత మన టాలీవుడ్ లో ఏ హీరోను కదిపినా పాన్ ఇండియా సినిమా పేరునే కలవరిస్తున్నారు.ఏ సినిమా ఫిక్స్ చేయాలనీ అనుకున్న ముందు పాన్ ఇండియా రేంజ్ లో వర్క్ అవుట్ అవుతుందా లేదా అని ఆలోచించిన తర్వాతనే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.
అలాగే సినిమా బడ్జెట్ కూడా వందల కోట్లు దాటిపోతున్నాయి.
ఇప్పటికే ప్రభాస్ అన్ని కూడా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ రేస్ లో ముందు ఉన్నాడు.
ఆ తర్వాత అల్లు అర్జున్ పుష్ప సినిమాతో తన స్టామినా నిరూపించు కున్నాడు.అక్కడ 100 కోట్ల మార్క్ ను టచ్ చేసి పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు.
ఇక త్వరలో రిలీజ్ కాబోతున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా ద్వారా రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరు కూడా పాన్ ఇండియా స్టార్ గా మారడానికి రెడీ అయ్యారు.
అలాగే విజయ్ దేవరకొండ కూడా ఇప్పటికే లైగర్ సినిమాను లైన్లో పెట్టి పాన్ ఇండియా స్టార్ అయిపోవాలని పూరీ తో కలిసి చాలా కష్ట పడుతున్నాడు.అయితే ఈ రేసులో మాత్రం ఇద్దరు స్టార్ హీరోలు వెనక బడి పోయారు అన్నది పలువురి వాదన.సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా పాన్ ఇండియా రేసులో వెనకబడి పోయారు.
వీరిద్దరు ఇంత వరకు ఒక్క సినిమా కూడా పాన్ ఇండియా సినిమా అని ప్రకటించలేదు.అయితే అందరి కంటే ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఈ ఇద్దరు స్టార్ హీరోలు ఎందుకు రేసులో వెనక బడి పోవడం ఏంటని వీరి ఫ్యాన్స్ సైతం ఆందోళన చెందుతున్నారు.వీరి ఏజ్ చుస్తే ఇద్దరికీ 40 ప్లస్.కాం ఇప్పటికి ఒక్క పాన్ ఇండియా సినిమా కూడా ట్రై చేయడం లేదు.
ఫ్యాన్స్ వీరి నుండి పాన్ ఇండియా సినిమా కోరుకుంటున్నారు.అయితే మహేష్ రాజమౌళి తో చేయబోతున్న సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఉంటుందని మహేష్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
పవన్ కూడా ఇదే ఏడాది పాన్ ఇండియా సినిమా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తుంది.మరి చూడాలి వీరు ఎప్పటికి పాన్ ఇండియా స్టార్ లుగా మారిపోతారో.