గుంటూరు గ్రానైట్ తవ్వకాలపై ఏపీ హైకోర్టు స్టే

గుంటూరు గ్రానైట్ తవ్వకాలపై ఏపీ హైకోర్టు స్టే ఇచ్చింది.జిల్లాలోని చిలకలూరిపేట మండలం మురికిపూడిలో తవ్వకాలు జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే.

ఈ క్రమంలో మంత్రి విడదల రజనీతో పాటు ఎంపీ అవినాష్ రెడ్డి, పలువురికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.ఎస్సీ, ఎస్టీల భూముల్లో డీకే పట్టా రద్దు చేయకుండా గ్రానైట్ తవ్వకాలకు ఎన్ఓసీ ఇవ్వడంపై పిటిషన్ దాఖలు అయింది.

ఈ మేరకు ఎన్ఓసీ ఇచ్చిన తహసిల్దార్ కు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.అనంతరం కేసు విచారణను ఏప్రిల్ 10వ తేదీకి వాయిదా వేసింది.

చలికాలంలో వచ్చే గొంతు నొప్పికి నివారణ ఈ చిట్కా చాలు..!
Advertisement