ఆంధ్రప్రదేశ్( Andhra Pradesh ) రాష్ట్రంలో మరో మూడు నెలలలో ఎన్నికలు జరగనున్నాయి.ఎన్నికలలో గెలవడానికి ప్రధాన పార్టీలు తీవ్ర స్థాయిలో కృషి చేస్తున్నాయి.
ఈ క్రమంలో ఎవరికి వారు వివిధ పార్టీల నేతలు ప్రజలలో ఉంటూ రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.2019 కంటే 2024 ఎన్నికలు కత్తిమీద సాము అన్న విధంగా పరిస్థితి నెలకొంది.ఏపీలో ప్రజల నాడి ఎవరు కనిపెట్టలేక పోతున్నారు.
దీంతో ఈసారి ఎవరు అధికారంలోకి వస్తారన్నది రాజకీయ మేధావులు సైతం చెప్పలేని పరిస్థితి నెలకొంది.పరిస్థితి ఇలా ఉండగా ఇటీవల వైఎస్ షర్మిల ( YS Sharmila )కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడంతో ఏపీలో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి.
దీంతో ఏపీలో మళ్ళీ కాంగ్రెస్ బలపడే అవకాశాలు ఉన్నాయని పలు పార్టీల నేతలు కామెంట్లు చేస్తున్నారు.
ఇదే సమయంలో కాంగ్రెస్( Congress ) అధిష్టానం కచ్చితంగా ఏపీలో పార్టీ బాధ్యతలు షర్మిల చేతికి అప్పగించబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది.పరిస్థితి ఇలా ఉంటే తాజా పరిణామాలపై కాంగ్రెస్ పార్టీ నాయకులపై విపక్షాలపై అధికార పార్టీకి చెందిన వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ( AP Deputy CM Narayanaswamy )సోనియా గాంధీ, చంద్రబాబుపై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.
వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణించడానికి కారణం ఆ ఇద్దరే అని విమర్శించారు.ఏపీలో కాంగ్రెస్ పార్టీని వైయస్ బతికించారు.ఆయన ఫోటో పెట్టుకునే అర్హత కాంగ్రెస్ పార్టీకి లేదు.
అని విమర్శించారు.ఎన్టీఆర్ మృతికి కారణమైన చంద్రబాబుకు అధికార దాహం తప్ప ప్రజల సంక్షేమం పట్టదని మండిపడ్డారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy