కాసేపటిలో లోటస్‎పాండ్‎కు ఏపీ సీఎం జగన్..!

ఏపీ సీఎం జగన్ మరికాసేపటిలో లోటస్‎పాండ్‎కు వెళ్లనున్నారు.ఈ మేరకు లోటస్‎పాండ్‎లో ఉన్న వైఎస్ విజయమ్మను ఆయన కలవనున్నారు.

దాదాపు మూడేళ్ల తరువాత సీఎం జగన్ లోటస్‎పాండ్‎కు వెళ్తున్నారు.అయితే సీఎం జగన్ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను పరామర్శించేందుకు హైదరాబాద్ కు వచ్చిన సంగతి తెలిసిందే.

బంజారాహిల్స్ లోని కేసీఆర్ నివాసానికి వెళ్లిన సీఎం జగన్ కు మాజీ మంత్రి కేటీఆర్ ఆహ్వానం పలికారు.ఈ క్రమంలో కేసీఆర్ ను పరామర్శించిన సీఎం జగన్ ఆయన ఆరోగ్య పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

మరో గంట సమయం పాటు అక్కడే ఉండనున్న సీఎం జగన్ కేసీఆర్ తో లంచ్ చేయనున్నారు.లంచ్ కార్యక్రమం తరువాత సీఎం జగన్ లోటస్‎పాండ్‎కు వెళ్లనున్నారని సమాచారం.

Advertisement
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 26, శుక్రవారం, కార్తీక మాసం, 2021

తాజా వార్తలు