తెలుగు చిత్ర పరిశ్రమలో అపజయం ఎరుగని దర్శకుడుగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తాజాగా వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీలో జరిగిన పూర్వ విద్యార్ధుల సమ్మేళనంలో పాల్గొన్నారు.ఈ క్రమంలోనే విద్యార్థులతో కలిసి సరదాగా ముచ్చటించడమే కాకుండా గ్రూప్ డిస్కషన్స్ కూడా చేశారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఇంజనీరింగ్ విద్యార్థులను ఉద్దేశించి అనిల్ రావిపూడి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.ఈ క్రమంలోనే ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఈ కార్యక్రమంలో భాగంగా అనిల్ రావిపూడి మాట్లాడుతూ ఎవరైతే నాలుగు సంవత్సరాలు కష్టపడి బీటెక్ పూర్తి చేస్తారో వాళ్లే నిజమైన స్టార్స్ అని అనిల్ తెలియజేశారు.ఇక ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్క విద్యార్థి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే.
ఎప్పుడు కూడా అవకాశాలు మనల్ని వెతుక్కుంటూ రావు మనమే అవకాశాలను వెతుక్కుంటూ వెళ్లాలి.ప్రతి ఒక్క విద్యార్థి తన జీవితంలో ఒక లక్ష్యం పెట్టుకోవాలని ఆ లక్ష్యం నెరవేరే దిశగా అడుగులు వేసి చివరికి విజయం సాధించాలని ఈయన తెలిపారు.
ఇక ప్రస్తుతం ఉన్న టెక్నాలజీని ఉపయోగించుకొని మన లక్ష్యానికి కాస్త మన టాలెంట్ జోడిస్తే ప్రతి ఒక్క విద్యార్థి ఎన్నో అద్భుతాలను సృష్టించవచ్చు అంటూ ఈయన తెలియజేశారు.ఇలా ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులను ఉద్దేశించి అనిల్ రావిపూడి ఎన్నో గొప్ప విషయాలను తెలియజేశారు.ఇక ఈయన సినిమాల విషయానికి వస్తే ఎఫ్ త్రీ సినిమా ద్వారా మంచి హిట్ అందుకున్న అనిల్ రావిపూడి ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా ఓ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమా NBK 108 టైటిల్ తో షూటింగ్ పనులను జరుపుకుంటుంది.