కొత్త వీడియోతో కదిలించిన అనసూయ

ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కారణంగా భారతదేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ అమలులో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.

ఈ నేపథ్యంలో అన్ని రంగాలకు చెందిన పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.

ప్రజలు ఇళ్లకే పరిమితం కావడంతో ప్రభుత్వాలు కూడా వారికి ఎలాంటి అసౌకర్యం లేకుండా చూస్తోంది.కాగా ఆహార భద్రత విషయంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు భరోసా కలిగించాయి.

అటు పలువురు సెలబ్రిటీలు సైతం ప్రజలకు సూచనలు, సలహాలు ఇస్తూ వారిని అప్రమత్తంగా ఉంచుతున్నారు.కాగా తాజాగా యాంకర్ కమ్ నటి అనసూయ భరద్వాజ్ కరోనా వైరస్ ప్రభావం వల్ల నష్టపోతున్న రైతులను ఆదుకోవాలని కోరింది.

రైతులు పండించిన ఆహారాన్ని కొనుగోలు చేసి ఈ కష్టకాలంలో వారికి సాయం చేసిన వారిగా నిలవాలని ఆమె పిలుపునిచ్చింది.ఇలా రైతుల కోసం అనసూయ చేసిన వీడియోను ఆమె అభిమానులతో పాటు నెటిజన్లు కూడా సోషల్ మీడియాలో షేర్లు చేస్తున్నారు.

Advertisement

కరోనా వైరస్ మహమ్మారి నుండి అందరూ జాగ్రత్తగా ఉండాలని ఆమె సూచించింది.

వెక్కి వెక్కి ఏడ్చిన ఫుట్ బాల్ దిగ్గజం.. వైరల్ వీడియో
Advertisement

తాజా వార్తలు